క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే.. నిన్న తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఇవాళ రెండు మ్యాచ్ ఉండగా.. తొలి మ్యాచ్ కోల్కతా, పంజాబ్ జట్ల ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ను ఎంచుకున్నారు. మ్యాచ్కు ముందు మొహాలీలో వర్షం పడటంతో.. పిచ్లో ఉన్న తేమను వాడుకోవాలనుకుంటున్నట్లు కేకేఆర్ కెప్టెన్ రాణా తెలిపాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. సౌథీ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 23/1 గా ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్ తుది జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, మన్ దీప్ సింగ్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చకరవర్తి
పంజాబ్ కింగ్స్ తుది జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్ సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేశ్ శర్మ, ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహెర్, అర్ష్దీప్ సింగ్