Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Says Once More Modi Sarkar

Kishan Reddy : మోడీ హ్యాట్రిక్​ ప్రధాని కాబోతున్నారు

Published Date :March 26, 2024 , 4:15 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : మోడీ హ్యాట్రిక్​ ప్రధాని కాబోతున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని, మోడీ ప్రధానిగా హ్యాట్రిక్​ కొట్టబోతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఆయా కాలనీల్లో పర్యటించారు. అంబర్​ ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, సత్యా నగర్, రత్న నగర్ లో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరిలో ఆర్ట్రియా 10 అపార్ట్​ మెంట్, కామపురి కాలనీలో శ్రీ సాయిరాం మనోహర్ అపార్ట్​ మెంట్స్, శ్రీనగర్ కాలనీలోని ఎస్​ బీహెచ్ కాలనీ, ఉషా ఎంక్లేవ్, సాయికిరణ్ అపార్​ మెంట్స్, కామపురి కాలనీలో కృషి మిడాస్ తదితర ప్రాంతాల్లో బర్యటించి కాలనీవాసులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో నిర్ణయించే ఎన్నికలు కావు. ప్రజలు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు పెరుగుతాయనే చర్చ ప్రజ ఉన్నది. కులాలు, మతాలతీతంగా ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నారు”అని అన్నారు.

దేశ భద్రత.. ఎవరి చేతిలో దేశం భద్రంగా ఉంటుందో, రేపటి మన పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉండాలంటే ఎవరు ప్రధాని కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కిషన్​ రెడ్డి కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ‘‘ప్రధాని మోడీ, ఆయన నాయకత్వం పట్ల ప్రజలు పూర్తి అభిమానంతో, విశ్వాసంతో ఉన్నారు. మోడీ నాయకత్వంలోనే మన దేశం, పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. భారీ మెజారిటీతో మోడీ మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి 2019లో 302 సీట్లు వస్తే.. ప్రజలు ఇచ్చిన భరోసాతో ఆయన ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో దేశ ప్రజలు ఈసారి 370 సీట్లు కట్టబెట్టపోతున్నారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావడం ఖాయం. డిజిటల్​ లావాదేవీల్లో, పేద సంక్షేమంలో, కరోనా వ్యాక్సిన్​, ఉగ్రవాదంపై అణచివేత, అయిదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్​ ఎదుగుదల లాంటి విజయాలు ప్రధాని మోడీ వల్లే సాధ్యమయ్యాయి”అని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

ఎంపీగా మీకు మాట రానివ్వను..

తాము ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ ఫలానా స్కామ్​ లో ఉన్నాడనో, ఫలానా తప్పు పని చేశాడనో ప్రజలు తలదించుకునే సందర్భాలు కొన్ని ఉంటాయని, అలాంటి వాటి విషయంలో తాను కచ్చితంగా దేశం కోసం నిలబడతానని కిషన్​ రెడ్డి ఆయా కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఎంపీగా తనను ఆశీర్వదిస్తే సమాజం కోసం, పేదల కోసం, దేశం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా సికింద్రాబాద్​ ప్రజలకు ఎలాంటి మాట రానివ్వనని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు నన్ను వారి కుటుంబ సభ్యుడిలా ఆప్యాయతతో పలకరిస్తున్నారు. మీకు అండగా మేముంటామని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు. అందుకు రుణపడి ఉంటాను’’అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ఆయా కాలనీల పర్యటన లో కిషన్ రెడ్డికి అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. మహిళలు, కాలనీ పెద్దలు, ప్రముఖులు స్వాగతం పలికారు. వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కిషన్​ రెడ్డి మాట్లాడారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Early Retirement Plan: 45 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలా? ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటిస్తే మీరు ధనవంతులే..

  • Anganwadi Jobs: మహిళలకు శుభవార్త.. 108 అంగన్‌వాడీ జాబ్స్.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  • Credit Cards: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా… అయితే సిబిల్ స్కోర్ ఢమాల్..?

  • OnePlus Pad 4: వన్ ప్లస్ ప్యాడ్ 4 లాంచ్ డేట్ ఫిక్స్.. స్నాప్ డ్రాగన్ 8 Elite, 13,380mAh బ్యాటరీతో పవర్‌హౌస్!

  • PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, నాది హామీ..

ట్రెండింగ్‌

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions