Kishan Reddy : వీర్ సావర్కర్ సేవలు చిరస్మరణీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయ సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది విజయం కాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు నగర్, స్వరాజ్య ప్రెస్ సర్కిల్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించి యాత్ర ప్రారంభించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తున్నది. కిషన్ రెడ్డి రోడ్ షోలో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొంటున్నారు. పద్మారావు నగర్ లో ప్రారంభమైన యాత్ర సికింద్రాబాద్ మీదుగా రసూల్ పురా, బేగంపేట్, అమీర్, సనత్ నగర్ ఎర్రగడ్డ మీదుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ దోపిడీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కిషన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా వాహనంలో ముందుకు వెళ్తండగా.. బిల్డింగులపై నుంచి అభిమానులు, ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు, తమ ఎంపీ కేంద్రమంత్రి తమ ముందుకు రావడంతో పైనుంచి పూలు చల్లుతు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారి అభిమానానికి కిషన్ రెడ్డి వందనం చేస్తూ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు.. కాషాయ తలపాగా ధరించి బైకు ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కిలోమీటర్ పొడవునా బైక్ ర్యాలీలతో కేంద్ర మంత్రి సంకల్ప యాత్ర రథం ముందుకు సాగుతున్నది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ కేంద్ర మంత్రి యాత్ర విజయ సంకల్పంతో ప్రవాహంలా సాగుతున్నది. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ లలో మాట్లాడుతుండగా.. ప్రజలు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. దేశానికి మళ్లీ ఎవరు ప్రధాని కావాలని కిషన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు స్పందిస్తూ.. చేయి పైకెత్తి మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కిషన్ రెడ్డి కార్నర్ మీటింగ్ లకు స్వచ్ఛందంగా వేలాది మంది తరలివస్తుండటంతో కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..