NTV Telugu Site icon

Kishan Reddy : అంబర్‌పేట్‌ నుండి బరిలోకి.. ఇండికేషన్ ఇచ్చిన కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

అంబర్‌పేట నియోజక వర్గ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల సమాయత్తతపై నిర్వహించిన చర్చలో అంబర్‌పేట నుండి తానే పోటీ చేస్తానని ఇండికేషన్ ఇచ్చారు కిషన్ రెడ్డి. అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆశావహులతోకిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పార్టీ శ్రేణులను కోరారు. ముషీరాబాద్ నుండి లక్ష్మణ్ పోటీ చేయడం లేదనేది ఈ మీటింగ్ ద్వారా స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ముఖ్య నేతల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కిషన్‌ రెడ్డి.

ఇదిలా ఉంటే.. అంతకుముందు కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తాను, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..ఇద్దరం పోటీ చేయొద్దని అనుకుంటున్నామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘మేమిద్దరం ఎన్నికల్లో పోటీ చేస్తే…మా నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మేం పోటీ చేయకుండా ఉంటే… రాష్ట్రమంతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం మా ఢిల్లీ పెద్దల నోటీస్ లో ఉంది.అయినా చివరికి హైకమాండ్ ఏది చెప్తే… అదే చేస్తం. పోటీ చేయబోమనేది మా ఆలోచన మాత్రమే.. దీనిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.