Kishan Reddy : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబల్ డిజిట్ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరిచిపోయారని, 100 రోజులోనే 6 గ్యారంటీ లను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు ఏమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజెపి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. రేవంత్ అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవ్వుకున్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టెలాగా లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున BJYM నేతలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బిజెపి కే భవిష్యత్ ఉంటుంది. బీఅర్ఎస్ పని అయిపోయింది. పాలక పార్టీకి బి అర్ ఎస్ కొమ్ముకస్తుంది. కాంగ్రెస్ లో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బిజెపి పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలో బిజెపి నుండి పోటీ చేయడానికి యువత సిద్ధంగా ఉండాలి. బీఅర్ ఎస్ కు ఓటు వేసిన కాంగ్రెస్ కు వేసినట్లే. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
- Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
- Kommidi Narasimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు!
తాజావార్తలు
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
-
CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!