Kishan Reddy : కాంగ్రెస్కు 10 ఎకరాలు.. బీఆర్ఎస్కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి ఉండదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ లో 10 ఎకరాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని, 11 ఎకరాలు తమ పార్టీ కి కేటాయించకుందన్నారు.
Also Read : Menthikura Chicken : మెంతికూర చికెన్ ను ఇలా తయారు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
Also Read
- Ravindra Jadeja: నో బాల్తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
- Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
కానీ.. సైన్స్ సిటీ కు మాత్రం స్థలం ఇవ్వరంటూ చురకలు అంటించారు. వరంగల్ లో సైనిక్ స్కూల్ నీ అటకెక్కించారని, మెట్రో ఎక్కడ వరకు ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పాత పట్నంలో ఎందుకు నిర్మించలేదని, ఎస్సీ విద్యార్థులు అకౌంట్స్ లో డబ్బులు వేస్తామని అంటే… గత పది నెలలు గా విద్యార్థులకు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని, ఆ డబ్బులు ప్రగతి భవన్ కి ఇవ్వండి మేము ఇస్తామని అంటున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికే దశాబ్ది ఉత్సవాలు.. తెలంగాణ ప్రజల కు కాదని ఆయన విమర్శించారు.
Also Read : Anirudh Ravichander: క్రేజ్ ను గట్టిగా వాడుతున్న అనిరుద్..హీరోలతో సమానంగా రెమ్యునరేషన్?
21 రోజుల పాటు ఈ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసిందని, బంగారు తెలంగాణ ఒక కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే అయిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిందని, విద్యా దినోత్సవం జరిపే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. విశ్వ విద్యాలయాలు కళావిహీనంగా తయారు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ ల్లో పోస్టు లు ఖాళీగా ఉన్నాయి.. 15 వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉంటే… అయన సంబరాలు జరుపుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Ravindra Jadeja: నో బాల్తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
-
Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
-
Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!