Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy At Sri Guru Bhagavatam Book Launch

Kishan Reddy : ప్రతిచోటా గురువు పాత్ర కీలకంగా ఉంది

Published Date :September 24, 2023 , 10:41 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : ప్రతిచోటా గురువు పాత్ర కీలకంగా ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ ఆరో సంపుటి.. తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శిల్పకలవేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సరస్వతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ 15 భారతీయ భాషల్లో అనువాదమై.. విశేషమైన ఆదరణ పొందుతుండటం చాలా సంతోషకరమన్నారు. ఇవాళ ఈ ‘శ్రీ గురు భాగవతం’.. ఆరో సంపుటి.. తెలుగు కాపీని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. ఒక పుస్తకం.. ఇన్ని వాల్యూమ్స్ లో రావడం.. ఇన్ని భాషల్లో విడుదల అవుతుండటం.. అభినందించదగిన విషయం.
దీంతోపాటుగా ఓ తెలుగు ఆధ్యాత్మిక యూట్యూబ్ చానల్ ను కూడా ఇవాళ ప్రారంభించుకోవడం పట్ల శుభాభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ సందర్భంగా గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం.. తల్లిదండ్రులే ఆది గురువులైనా.. విద్యాబుద్ధులు చెప్పి సరైన మార్గదర్శనం చేసే గురువు సహకారం లేకుండా ముందడుగు వేయడం కష్టం. మన పురాణేతి హాసాలు మొదలుకుని.. నేటివరకు ప్రతిచోటా గురువు పాత్ర కీలకంగా ఉంది. అవతార పురుషులైన.. రాముడు వశిష్ట మహాముని దగ్గర
కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర.. శిష్యరికం చేసిన సంగతి మనకు తెలుసు. ఎంతటివారైనా.. గురువు మార్గదర్శనం అవసరం అని చెప్పడమే నా ఉద్దేశం.. గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమ: ఈ శ్లోకం తెలియని వారుండరు.. గురువే సర్వస్వం అని చెప్పడం ఈ శ్లోకం భావన. భారతదేశం జ్ఞాన భాండాగారం. ఎన్నో తరాలుగా గురు పరంపర, జ్ఞాన పరంపర ప్రభావం కారణంగా విదేశీయులు ఇక్కడికొచ్చిన విద్యనభ్యసించేవారు. ఆ తర్వాత విదేశీ శక్తుల కుట్రలు, యుద్ధాల కారణంగా చాలా మటుకు ఈ జ్ఞాన సంపదకు నష్టం వాటిల్లింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా.. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు పెద్దగా జరగలేదు.

నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మెకాలే వంటి వ్యక్తుల ప్రభావంతో దెబ్బతిన్న మన విద్యావ్యవస్థకు మళ్లీ పాత వెలుగులు అందించేందుకు.. 34 ఏళ్ల తర్వాత జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో.. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్.. మ్యాథ్స్, వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషలతోపాటుగా.. నైతిక విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల జీవన విధానం.. మన చారిత్రక కట్టడాలు, చరిత్రాత్మకమైన ఘట్టాలు తదితర అంశాలకు పెద్దపీట వేస్తున్నారు.

ఎప్పుడైతే విద్యార్థి దశనుంచే.. సంస్కారం, విషయ పరిజ్ఞానం, మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి జ్ఞాన సంపద గురించి తెలుస్తుందో.. అప్పుడే చిన్నారుల్లో ఓ ఆలోచన, ఓ కుతూహం మొదలవుతుంది. అదే భవిష్యత్తులో వారు మన దేశం గురించి.. మన ధర్మం గురించి దృష్టిలో ఉంచుకుని పనిచేసేందుకు వీలవుతుంది.

మన సంస్కృతి, సంప్రదాయాలు కలకాలం నిలవాలి, దేశ భవిష్యత్తు బాగుండాలంటే.. రేపటి తరమైన చిన్నారులకు మన ఆధ్యాత్మిక సంపద, వారసత్వ సంపద గురించి తెలియాలి. గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి వంటి వారు రాస్తు్న పుస్తకాలు చదవాలి. రిటైర్డ్ అధికారులు తమ విస్తృత అనుభవానికి.. ఆధ్యాత్మికతను జోడిస్తే.. ఆసక్తికరమైన రచనలు యువతరం కోసం సిద్ధమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద రావు రిటైర్మెంట్ తర్వాత యువతను ఈ దిశగా ప్రేరేపించేందుకు కృషిచేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరగాలి.. మన దేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా చూసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మనమంతా.. ‘నేను సైతం’ అన్నట్లుగా తలోచేయి వేయాలని ఆకాంక్షిస్తున్నాను. డాక్టర్ చంద్రభాను సత్పతికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ‘తెలుగు కల్చరల్ ఫౌండేషన్’ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని కిషన్‌ రెడ్డి ప్రసంగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions