Kidnap Murder Case: హైదరాబాద్ లోని సూరారంలో తల్లిని అనుభవించాలన్న కోరికతో ఆమె కూతురిని హత్య చేసిన ఘటనలో ‘తిరుపతి’ అనే యువకుడిని అరెస్ట్ చేసారు పోలీసులు. బాలికని హత్య చేస్తే తల్లిని అనుభవించవచ్చునని కోరికతో హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మరణించిన బాలిక మరొక సోదరితో పాటు సహజీవనం చేస్తున్న యువకుడ్ని కూడా చంపాలని ప్లాన్ చేసాడని, అలా చేస్తే బాలిక తల్లికి ఎవరు లేకపోతే తన దగ్గరకు వస్తుందని తిరుపతి ఆశించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బాలిక తల్లి కోసం ఏకంగా ముగ్గురిని చంపేందుకు ప్లాన్ చేసాడు తిరుపతి.
Read also: Nayab Singh Saini: హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా నయాజ్ సింగ్ సైనీ.. రేపు సీఎంగా ప్రమాణం..
ముందుగా ఏడేళ్ల బాలికను హత్య చేసి, ఆ తర్వాత మరో బాలికను హత్య చేయాలని ప్లాన్ చేసాడని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే బాలికను కిడ్నాప్ చేసి కత్తితో గొంతు కోసి చంపాడు తిరుపతి. ఆపై బాలిక మృతి దేహంను గుర్తుపట్టకుండా ఉండేందుకే గోన సంచిలో కుక్కి పారిపోయాడు తిరుపతి. ఈ ఘటనలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసాడని అధికారులు తెలిపారు.
Read also: Bahraich Violence : బహ్రైచ్ హింసలో ఇప్పటివరకు 50 మంది అరెస్టు.. కొనసాగుతున్న ఇంటర్నెట్ బంద్