Khammam: దారి తప్పిన ఎస్సై.. భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య..!
- 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి
- ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె
- కట్టుకున్న భార్యకు సైతం రోజూ వేధింపులు
- తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా ఆగని వేధింపులు
- 2 రోజుల క్రితం పురుగుల మందు తాగిన రాజేశ్వరి
- ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
- రాణా ప్రతాప్పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె ఉన్నారు..
READ MORE: Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
ఇంత వరకు బాగానే ఉంది. కానీ పోలీసు కుటుంబ నేపథ్యం ఉండి… ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ దారి తప్పాడు. ఖమ్మంలో ట్రెయినీ ఎస్సైగా ఉన్నప్పడే గన్తో పలువురు చిరు వ్యాపారులను బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు కట్టుకున్న భార్యను సైతం రోజూ వేధిస్తున్నాడు. దీంతో కొంత కాలం నుంచి భార్య రాజేశ్వరి దూరంగా ఉంటోంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా.. రాజేశ్వరికి వేధింపులు తప్పలేదు. భర్త, అత్త, మామ వేధించడంతో వాటిని భరించలేక 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందింది..
ఐతే అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి బంధువులు. దీంతో ఎస్సై రాణా ప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఉన్నతాధికారులు రాణా ప్రతాప్పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అటు రాణా ప్రతాప్పై రాజేశ్వరి బంధువులు దాడి చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పోలీసుగా విధులు నిర్వహిస్తూ.. నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి.. ఏకంగా తన భార్యనే వేధించాడు. అతనికి తల్లిదండ్రులతోపాటు తమ్ముడు ఎస్సై మహేష్ కూడా తోడయ్యాడు. దీంతో కుటుంబం మొత్తం వేధించడాన్ని తట్టుకోలేని రాజేశ్వరి.. తనువు చాలించింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా పోయింది..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?