Khammam: దారి తప్పిన ఎస్సై.. భార్యను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య..!
- 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి
- ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె
- కట్టుకున్న భార్యకు సైతం రోజూ వేధింపులు
- తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా ఆగని వేధింపులు
- 2 రోజుల క్రితం పురుగుల మందు తాగిన రాజేశ్వరి
- ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
- రాణా ప్రతాప్పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఓ కుమారుడు, కూమార్తె ఉన్నారు..
READ MORE: Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ఇంత వరకు బాగానే ఉంది. కానీ పోలీసు కుటుంబ నేపథ్యం ఉండి… ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ దారి తప్పాడు. ఖమ్మంలో ట్రెయినీ ఎస్సైగా ఉన్నప్పడే గన్తో పలువురు చిరు వ్యాపారులను బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు కట్టుకున్న భార్యను సైతం రోజూ వేధిస్తున్నాడు. దీంతో కొంత కాలం నుంచి భార్య రాజేశ్వరి దూరంగా ఉంటోంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా.. రాజేశ్వరికి వేధింపులు తప్పలేదు. భర్త, అత్త, మామ వేధించడంతో వాటిని భరించలేక 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 2 రోజులపాటు చికిత్స పొందుతూ మృతి చెందింది..
ఐతే అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి బంధువులు. దీంతో ఎస్సై రాణా ప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఉన్నతాధికారులు రాణా ప్రతాప్పై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అటు రాణా ప్రతాప్పై రాజేశ్వరి బంధువులు దాడి చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పోలీసుగా విధులు నిర్వహిస్తూ.. నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి.. ఏకంగా తన భార్యనే వేధించాడు. అతనికి తల్లిదండ్రులతోపాటు తమ్ముడు ఎస్సై మహేష్ కూడా తోడయ్యాడు. దీంతో కుటుంబం మొత్తం వేధించడాన్ని తట్టుకోలేని రాజేశ్వరి.. తనువు చాలించింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా పోయింది..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!