Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
- ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు.
- కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఘటన.
- ఏనుగు దాడిలో 20 మందికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aggressive Elephant: కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఒక ఏనుగు విరుచుకుపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదు ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అయితే, ఇందులో పక్కాతు శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా ప్రజలపై ఆగ్రహం చూపించింది. ఈ ఏనుగు తొండంతో ఓ వ్యక్తిని పైకి ఎత్తి పడేయడంతో అతడు పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ గాయపడిన వ్యక్తిని వెంటనే అక్కడి ప్రజల సహాయంతో చికిత్స కోసం కొట్టక్కల్లోని మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఆ వ్యక్తి మాతరమే కాకుండా మొత్తంగా 20 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Also Read: Har Ghar Lakhpati: ఎస్బీఐలో అకౌంట్ ఉందా?.. రోజుకు రూ. 85 పొదుపుతో చేతికి రూ. లక్ష పొందండి!
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
ఈ ఘటన పండుగ చివరి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రంలో భాగంగా ఐదు ఏనుగులను బంగారు ఆభరణాలతో అలంకరించి, ఊరేగింపులో భాగంగా వీటిని ప్రవహింపజేశారు. కానీ, ఈ సమయంలో శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా ప్రజలు ఉన్న పరిసరాల్లోకి వచ్చి దూకుడును ప్రదర్శించింది. ఏనుగు దూకుడు కారణంగా ప్రజలు అటు ఇటు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలంలో ఏనుగును నియంత్రించేందుకు మహోత్ గలిగిన వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు, రాత్రి 2.15 గంటల సమయంలో ఏనుగును పూర్తిగా నియంత్రించి, మరింత నష్టం జరగకుండా నిరోధించారు. ఇప్పటివరకు, ఈ సంఘటనపై ఎలాంటి అధికారిక నివేదిక విడుదల కాలేదు. కానీ ఈ ఘటనను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!