Kerala Rains: కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల్లో 11 సెం.మీ నుండి 20 సెం.మీ మధ్య భారీ వర్షం కురుస్తుందని సూచించింది.
Trending Video: మృగరాజు మరణాన్ని శాసించిన దున్నపోతు.. వైరల్ వీడియో..
Also Read
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
ఈ నేపథ్యంలో.. భారీ వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలను హెచ్చరించారు. “తక్కువ కాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. నిరంతర వర్షపాతం కొండచరియలు విరిగిపడవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని పినరయి విజయన్ పేర్కొన్నారు. సీల్ లేని ఇళ్లు, పైకప్పు బలహీనంగా ఉన్న ఇళ్లలో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి విజయన్ కోరారు. ఆపదలో ఉన్నవారు అధికారులను సంప్రదించి భద్రతా పరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
Palestine protests effect: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తాళం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 223 మందిని ఎనిమిది శిబిరాలకు తరలించారు. దీంతోపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కేరళ అంతటా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రధాన నగరాలు వరద నీటిలో కూరుకుపోయాయి. కొచ్చిలో కెఎస్ఆర్టిసి బస్టాండ్, ఎంజి రోడ్తో సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. బాధిత నివాసితులకు సహాయం చేయడానికి తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో రెండు సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. కోజికోడ్లోని మావూరు ప్రాంతంలో వర్షాలు భారీగా పడటంతో వ్యవసాయ రంగం అపారంగా నష్టపోయింది. ఇటు.. మలప్పురం, కాసర్గోడ్ జిల్లాల్లో చిన్నపాటి కొండచరియలు విరిగిపడడంతోపాటు అలప్పుజాలోని జాతీయ రహదారిపై తురవూర్ ప్రాంతంలో మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!