Kerala Rains: కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల్లో 11 సెం.మీ నుండి 20 సెం.మీ మధ్య భారీ వర్షం కురుస్తుందని సూచించింది.
Trending Video: మృగరాజు మరణాన్ని శాసించిన దున్నపోతు.. వైరల్ వీడియో..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఈ నేపథ్యంలో.. భారీ వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలను హెచ్చరించారు. “తక్కువ కాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. నిరంతర వర్షపాతం కొండచరియలు విరిగిపడవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని పినరయి విజయన్ పేర్కొన్నారు. సీల్ లేని ఇళ్లు, పైకప్పు బలహీనంగా ఉన్న ఇళ్లలో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి విజయన్ కోరారు. ఆపదలో ఉన్నవారు అధికారులను సంప్రదించి భద్రతా పరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
Palestine protests effect: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తాళం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 223 మందిని ఎనిమిది శిబిరాలకు తరలించారు. దీంతోపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కేరళ అంతటా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రధాన నగరాలు వరద నీటిలో కూరుకుపోయాయి. కొచ్చిలో కెఎస్ఆర్టిసి బస్టాండ్, ఎంజి రోడ్తో సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. బాధిత నివాసితులకు సహాయం చేయడానికి తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో రెండు సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. కోజికోడ్లోని మావూరు ప్రాంతంలో వర్షాలు భారీగా పడటంతో వ్యవసాయ రంగం అపారంగా నష్టపోయింది. ఇటు.. మలప్పురం, కాసర్గోడ్ జిల్లాల్లో చిన్నపాటి కొండచరియలు విరిగిపడడంతోపాటు అలప్పుజాలోని జాతీయ రహదారిపై తురవూర్ ప్రాంతంలో మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?