Kedarnath Yatra: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన కేదరనాథ్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kedarnath Yatra: దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఢిల్లీ-ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఉత్తరాఖండ్కు కూడా చేరుకున్నాయి. దీని కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని కొండలు, మైదాన ప్రాంతాలలో అడపాదడపా వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తత కారణంగా, సోన్ప్రయాగ్లో ప్రయాణికులను నిలిపివేశారు. అంతేకాకుండా కేదార్నాథ్ యాత్రను కూడా ఆపేశారు.
కేదార్నాథ్ యాత్రకు సంబంధించి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ.. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. సోన్ప్రయాగ్, గౌరీకుండ్ నుండి ఉదయం 10.30 నుండి ప్రయాణికులు అక్కడే ఉండాలని కోరారు. ఈరోజు(ఆదివారం) ఉదయం 8 గంటల వరకు సోన్ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు మొత్తం 5,828 మంది ప్రయాణికులు బయలుదేరారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also:Assam Flood: అస్సాంలో వరద విధ్వంసం.. 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు
వర్షం మధ్యే డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అధికారులు, ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెహ్రాడూన్లో వర్షం కారణంగా 9 రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. ఒక రాష్ట్ర రహదారి, తొమ్మిది గ్రామీణ రహదారులపై శిధిలాలు ఉన్నాయి. రహదారులను తెరవడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని డెహ్రాడూన్ వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి డెహ్రాడూన్ సహా ఏడు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, చంపావత్, పిథోరాఘర్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also:Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!