Kedarnath Yatra: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన కేదరనాథ్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kedarnath Yatra: దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఢిల్లీ-ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఉత్తరాఖండ్కు కూడా చేరుకున్నాయి. దీని కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని కొండలు, మైదాన ప్రాంతాలలో అడపాదడపా వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తత కారణంగా, సోన్ప్రయాగ్లో ప్రయాణికులను నిలిపివేశారు. అంతేకాకుండా కేదార్నాథ్ యాత్రను కూడా ఆపేశారు.
కేదార్నాథ్ యాత్రకు సంబంధించి జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ.. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. సోన్ప్రయాగ్, గౌరీకుండ్ నుండి ఉదయం 10.30 నుండి ప్రయాణికులు అక్కడే ఉండాలని కోరారు. ఈరోజు(ఆదివారం) ఉదయం 8 గంటల వరకు సోన్ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు మొత్తం 5,828 మంది ప్రయాణికులు బయలుదేరారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు మూసుకుపోయిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Also Read
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
Read Also:Assam Flood: అస్సాంలో వరద విధ్వంసం.. 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు
వర్షం మధ్యే డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి.. అధికారులు, ఉద్యోగులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెహ్రాడూన్లో వర్షం కారణంగా 9 రోడ్లు బ్లాక్ చేయబడ్డాయి. ఒక రాష్ట్ర రహదారి, తొమ్మిది గ్రామీణ రహదారులపై శిధిలాలు ఉన్నాయి. రహదారులను తెరవడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని డెహ్రాడూన్ వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి డెహ్రాడూన్ సహా ఏడు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, చంపావత్, పిథోరాఘర్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also:Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!