Beerla Ilaiah : ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… ఎమ్మెల్సీ కవితపై బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు
- కవిత వ్యాఖ్యలపై బీర్ల అయిలయ్య మండిపాటు
- రైతు బంధు, RTC సమ్మె, సామాజిక న్యాయం పై ఎదురుదాడి
- కుల గణనతో తెలంగాణ రాజకీయ వేడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beerla Ilaiah : తెలంగాణలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కవిత ఇప్పటికైనా తెలంగాణ పట్ల సోయి చూపించడం గమనార్హమని చెప్పారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఇప్పుడు కవితకు అర్థమవుతోందంటే, గత 10 ఏళ్లలో తండ్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆమె గుర్తించుకుంటున్నట్లు తెలుస్తోందని ఐలయ్య ఎద్దేవా చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులు, అప్పులు గురించి కవిత ఒక్కమాట కూడా మాట్లాడలేదని, రైతుబంధు పథకంపై నిజమైన రైతులకు లాభం లేదన్న ఆరోపణలపై అప్పట్లో స్పందించలేదని గుర్తు చేశారు బీర్ల ఐలయ్య. భూమిలేని వ్యవసాయ కూలీలకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ డిమాండ్ను పట్టించుకోకపోయారని ఆరోపించారు.
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
మా ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని కూలీలకు సాయం చేస్తోందని, అప్పుడు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్లను ప్రశ్నించని కవితకు ఇప్పుడు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? అని ఐలయ్య ప్రశ్నించారు.
ఆర్టీసీ సమ్మె సమయంలో 30 మంది కార్మికులు చనిపోయినా కవిత స్పందించలేదని ఐలయ్య గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి తన ప్రాధాన్యం తగ్గిపోవడమే కవిత ఇప్పుడీ మాటలు మాట్లాడటానికి కారణం అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడే కవిత తన తండ్రి కేసీఆర్ను ప్రశ్నించి ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు.
ఇప్పటికైనా ఆమె కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులను బయటపెట్టి ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. ఇక బీజేపీ నేతలపై కూడా ఐలయ్య విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులగణనపై సోయిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రధాని మోడీ కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారని అన్నారు.
రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ హీరో చేశారని, కులగణన వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు పెరిగిందని అన్నారు. ఈ విజయం బీజేపీ నేతలకు జీర్ణించుకోవడం కష్టంగా మారిందన్నారు. బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపించడమే మా తొలి ఘనవిజయంఅని ఐలయ్య స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!