MLC Kavitha : బీసీ బిల్ కోసం జులై 17 న రైలు రోకో
- ఆపరేషన్ కగార్ ఆపివేసి పరిష్కారం చూపాలని కోరుతున్నాం
- సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాడుకోవాలని మాత్రమే కేసీఆర్ అన్నారు
- చంద్ర బాబు తో రేవంత్ రెడ్డి కి ఉన్న లాలూచీ ఏమిటి : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. కేసీఆర్ గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా పోకుండా వాడుకలోకి తేవాలని మాత్రమే అన్నాడు. కానీ, నదుల అనుసంధానం అంశానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదు అని ఆమె వివరణ ఇచ్చారు.
Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్లో నేను లేను.. సమంత క్లారిటీ
Also Read
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
ఏపీ కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. అలా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? చంద్రబాబుతో రేవంత్కు ఉన్న లాలూచీ ఏమిటి? అని ప్రశ్నించారు. నల్లమల టైగర్ అంటూ కాదు, పని చేసి చూపించండి “రేవంత్ రెడ్డి నల్లమల టైగర్ అంటూ చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే బొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ను నిలిపివేయాలి. లేదంటే, మీరు కేవలం పేపర్ పులి అని ప్రజలకు తేటతెల్లం అవుతుంది,” అంటూ సెటైర్లు వేశారు. “ఢిల్లీకి హాఫ్ సెంచరీ కొడుతున్నారు కానీ బీసీల కోసం అడగడంలేదు. బీసీ బిల్లు గురించి మోదీని అడగాలి,” అని స్పష్టం చేశారు.
బీసీలకు రాజకీయం హక్కులు లభించేలా కేంద్రం వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, జులై 17న రైలు రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీకి వెళుతున్న సీఎం.. బీసీ బిల్లు పట్టుకుని తిరిగి హైదరాబాద్కు రావాలి అంటూ హెచ్చరించారు.
Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
తాజావార్తలు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!