MLC Kavitha : బీసీ బిల్ కోసం జులై 17 న రైలు రోకో
- ఆపరేషన్ కగార్ ఆపివేసి పరిష్కారం చూపాలని కోరుతున్నాం
- సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాడుకోవాలని మాత్రమే కేసీఆర్ అన్నారు
- చంద్ర బాబు తో రేవంత్ రెడ్డి కి ఉన్న లాలూచీ ఏమిటి : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. కేసీఆర్ గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా పోకుండా వాడుకలోకి తేవాలని మాత్రమే అన్నాడు. కానీ, నదుల అనుసంధానం అంశానికి ఎప్పుడూ ఓకే చెప్పలేదు అని ఆమె వివరణ ఇచ్చారు.
Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్లో నేను లేను.. సమంత క్లారిటీ
Also Read
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు. అలా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? చంద్రబాబుతో రేవంత్కు ఉన్న లాలూచీ ఏమిటి? అని ప్రశ్నించారు. నల్లమల టైగర్ అంటూ కాదు, పని చేసి చూపించండి “రేవంత్ రెడ్డి నల్లమల టైగర్ అంటూ చెప్పుకుంటున్నారు. అది నిజమే అయితే బొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ను నిలిపివేయాలి. లేదంటే, మీరు కేవలం పేపర్ పులి అని ప్రజలకు తేటతెల్లం అవుతుంది,” అంటూ సెటైర్లు వేశారు. “ఢిల్లీకి హాఫ్ సెంచరీ కొడుతున్నారు కానీ బీసీల కోసం అడగడంలేదు. బీసీ బిల్లు గురించి మోదీని అడగాలి,” అని స్పష్టం చేశారు.
బీసీలకు రాజకీయం హక్కులు లభించేలా కేంద్రం వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, జులై 17న రైలు రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీకి వెళుతున్న సీఎం.. బీసీ బిల్లు పట్టుకుని తిరిగి హైదరాబాద్కు రావాలి అంటూ హెచ్చరించారు.
Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జన ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
తాజావార్తలు
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు