Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం అనగానే దీపారాధన, నదీ స్నానాలు, వనభోజనాలు గుర్తుకొచ్చి తీరుతాయి. వీటితో పాటుగా మరికొన్ని నియమాలు లేకపోలేదు. అందులో ఆహారానికి సంబంధించి నియమం ముఖ్యమైనది. మనం తీసుకొనే ఆహారం మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో అని ఆహారం కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనేది పెద్దల ఆలోచన. దానికోసం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండిన ఆహారం తినకూడదు అని సూచించారు. అంటే నెలంతా కూడా స్నానం చేసి మాత్రమే వంట చేయాలంట.
Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం
అలాగే రెండోసారి వెచ్చ చేసిన ఆహారం, మాడిపోయిన పదార్థాలు, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినటం ఇలాంటివన్నీ ఈ కార్తీకమాసంలో చెయ్యకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీకమాసంలో బయట భోజనం చేయకూడదు అనేది పెద్దల మాట. ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్ధాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. అందుకే కార్తీకమాసంలో పరాయి ఇళ్లలో ఆహారం తినడాన్ని నిషేధించారు. ఇక కార్తీక సంవత్సరంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఆదివారాన్ని నిషిద్ధ తినాలని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక ఏకాదశి తిధుల్లో అయితే రెండు పూటలా భోజనం చేయకపోవడం ఉత్తమం అని చెప్తారు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి ఆషాడమాసంలోని సైనా ఏకాదశినాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారంట.
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
అలా నిద్రించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశినాడు మేలు కొంటారు. ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యం అని పిలుస్తారు. యతుల దగ్గర నుంచి సామాన్యులు వరకు ఈ నాలుగు నెలలు రక రకాల ఆహార నియమాలని పాటిస్తారు. వాటిలో భాగంగా కార్తీకమాసంలో ద్విదళ ధ్యానాలు తినకూడదు అని చెప్తారు. అంటే బద్దలు గా వచ్చే కందులు, మినుములు, పెసలు, శెనగలు వంటి పప్పు ధాన్యాలు అన్నమాట. వీటిని ఈ కార్తీకమాసంలో తినకూడదు. కార్తీకమాసంలో దైవారాధన కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సందర్భంలో మనసుని ప్రభావితం చేసే ఉల్లి, ఇంగువ, మునగాకు, ముల్లంగి ఇలాంటి పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండమని చెప్తారు పెద్దలు.
ఇక కార్తీక మాసపు చలికి తోడుగా అనారోగ్యాలు అందించి ఆనపకాయ, పుచ్చకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి పదార్థాలను కూడా విసర్జించాలి సూచిస్తున్నారు. కార్తీకమాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనక పాటిస్తే అటు ఆరోగ్యము, ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయనేది తరతరాల నమ్మకం. కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన దానికి అనుగుణంగా మనం ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి, ఇటు ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి.
- Tags
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!