Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం అనగానే దీపారాధన, నదీ స్నానాలు, వనభోజనాలు గుర్తుకొచ్చి తీరుతాయి. వీటితో పాటుగా మరికొన్ని నియమాలు లేకపోలేదు. అందులో ఆహారానికి సంబంధించి నియమం ముఖ్యమైనది. మనం తీసుకొనే ఆహారం మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో అని ఆహారం కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనేది పెద్దల ఆలోచన. దానికోసం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండిన ఆహారం తినకూడదు అని సూచించారు. అంటే నెలంతా కూడా స్నానం చేసి మాత్రమే వంట చేయాలంట.
Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం
అలాగే రెండోసారి వెచ్చ చేసిన ఆహారం, మాడిపోయిన పదార్థాలు, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినటం ఇలాంటివన్నీ ఈ కార్తీకమాసంలో చెయ్యకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీకమాసంలో బయట భోజనం చేయకూడదు అనేది పెద్దల మాట. ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్ధాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. అందుకే కార్తీకమాసంలో పరాయి ఇళ్లలో ఆహారం తినడాన్ని నిషేధించారు. ఇక కార్తీక సంవత్సరంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఆదివారాన్ని నిషిద్ధ తినాలని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక ఏకాదశి తిధుల్లో అయితే రెండు పూటలా భోజనం చేయకపోవడం ఉత్తమం అని చెప్తారు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి ఆషాడమాసంలోని సైనా ఏకాదశినాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారంట.
Also Read
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
అలా నిద్రించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశినాడు మేలు కొంటారు. ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యం అని పిలుస్తారు. యతుల దగ్గర నుంచి సామాన్యులు వరకు ఈ నాలుగు నెలలు రక రకాల ఆహార నియమాలని పాటిస్తారు. వాటిలో భాగంగా కార్తీకమాసంలో ద్విదళ ధ్యానాలు తినకూడదు అని చెప్తారు. అంటే బద్దలు గా వచ్చే కందులు, మినుములు, పెసలు, శెనగలు వంటి పప్పు ధాన్యాలు అన్నమాట. వీటిని ఈ కార్తీకమాసంలో తినకూడదు. కార్తీకమాసంలో దైవారాధన కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సందర్భంలో మనసుని ప్రభావితం చేసే ఉల్లి, ఇంగువ, మునగాకు, ముల్లంగి ఇలాంటి పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండమని చెప్తారు పెద్దలు.
ఇక కార్తీక మాసపు చలికి తోడుగా అనారోగ్యాలు అందించి ఆనపకాయ, పుచ్చకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి పదార్థాలను కూడా విసర్జించాలి సూచిస్తున్నారు. కార్తీకమాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనక పాటిస్తే అటు ఆరోగ్యము, ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయనేది తరతరాల నమ్మకం. కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన దానికి అనుగుణంగా మనం ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి, ఇటు ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి.
- Tags
తాజావార్తలు
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్