Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం అనగానే దీపారాధన, నదీ స్నానాలు, వనభోజనాలు గుర్తుకొచ్చి తీరుతాయి. వీటితో పాటుగా మరికొన్ని నియమాలు లేకపోలేదు. అందులో ఆహారానికి సంబంధించి నియమం ముఖ్యమైనది. మనం తీసుకొనే ఆహారం మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో అని ఆహారం కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనేది పెద్దల ఆలోచన. దానికోసం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండిన ఆహారం తినకూడదు అని సూచించారు. అంటే నెలంతా కూడా స్నానం చేసి మాత్రమే వంట చేయాలంట.
Also Read : Koti Deepotsavam Day 1 : సహస్ర కలశాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర కల్యాణం
అలాగే రెండోసారి వెచ్చ చేసిన ఆహారం, మాడిపోయిన పదార్థాలు, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినటం ఇలాంటివన్నీ ఈ కార్తీకమాసంలో చెయ్యకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీకమాసంలో బయట భోజనం చేయకూడదు అనేది పెద్దల మాట. ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్ధాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. అందుకే కార్తీకమాసంలో పరాయి ఇళ్లలో ఆహారం తినడాన్ని నిషేధించారు. ఇక కార్తీక సంవత్సరంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య ఆదివారాన్ని నిషిద్ధ తినాలని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక ఏకాదశి తిధుల్లో అయితే రెండు పూటలా భోజనం చేయకపోవడం ఉత్తమం అని చెప్తారు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తి ఆషాడమాసంలోని సైనా ఏకాదశినాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారంట.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అలా నిద్రించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశినాడు మేలు కొంటారు. ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యం అని పిలుస్తారు. యతుల దగ్గర నుంచి సామాన్యులు వరకు ఈ నాలుగు నెలలు రక రకాల ఆహార నియమాలని పాటిస్తారు. వాటిలో భాగంగా కార్తీకమాసంలో ద్విదళ ధ్యానాలు తినకూడదు అని చెప్తారు. అంటే బద్దలు గా వచ్చే కందులు, మినుములు, పెసలు, శెనగలు వంటి పప్పు ధాన్యాలు అన్నమాట. వీటిని ఈ కార్తీకమాసంలో తినకూడదు. కార్తీకమాసంలో దైవారాధన కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని సందర్భంలో మనసుని ప్రభావితం చేసే ఉల్లి, ఇంగువ, మునగాకు, ముల్లంగి ఇలాంటి పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండమని చెప్తారు పెద్దలు.
ఇక కార్తీక మాసపు చలికి తోడుగా అనారోగ్యాలు అందించి ఆనపకాయ, పుచ్చకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి పదార్థాలను కూడా విసర్జించాలి సూచిస్తున్నారు. కార్తీకమాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనక పాటిస్తే అటు ఆరోగ్యము, ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయనేది తరతరాల నమ్మకం. కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన దానికి అనుగుణంగా మనం ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి, ఇటు ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి.
- Tags
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!