Karnataka Crime: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Karnataka Crime: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య తన భర్తకు తినే అన్నంలో విషం పెట్టి చంపింది. తర్వాత ఏం తెలియనట్లు నటిస్తూ పులి దాడిలో ఆయన చనిపోయినట్లు తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. హున్సురు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి(45), సల్లపురి భార్యాభర్తలు. వీళ్లు అరెకా గింజల తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.
READ ALSO: Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. మా విధానం అదే..!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. హెజ్జూర్ గ్రామంలో సోమవారం ఒక పులి కనిపించింది. ఈక్రమంలో భార్య సల్లపురిగా పులి సంచరిస్తున్నట్లు వచ్చిన పుకార్లను ఆసరాగా చేసుకుని తన భర్తను చంపడానికి కుట్ర పన్నింది. అడవి జంతువుల దాడుల వల్ల సంభవించే మరణాలకు ప్రభుత్వం అందించే భారీ పరిహారం పొందడానికి ఆ మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని విచారణలో వెలుగు చూసిందన్నారు. అనంతరం తమ విచారణలో భర్తను చంపినట్లు ఒప్పుకుందని పోలీసు తేలిపారు.
ముందుగా ఆమె తన భర్తను చంపి, ఆయన తప్పిపోయాడని, ఆ పులి తన భర్తను చంపి మృతదేహాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి ఈడ్చుకెళ్లి ఉండవచ్చని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వెంకటస్వామి మృతదేహాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఎంత వెతికిన బయట భర్త ఆచూకీ లభించకపోవడంతో వాళ్ల ఇంటి పరిసరాల్లో కూడా వెతికారు. అప్పుడు ఇంటి వెనుక ఉన్న ఆవు పేడ కుప్పలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం భార్యను విచారించగా, ఆమె హత్య చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. అడవి జంతువుల దాడుల వల్ల సంభవించే మరణాలకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారం అందిస్తుందని విని, హత్యకు ప్లాన్ చేసినట్లు ఆమె అంగీకరించిందని పేర్కొన్నారు. సంఘటనపై హుణసురు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: Health Tips: అలర్ట్.. కప్పు చాయ్తో గుప్పెడు గుండెకు ప్రమాదం..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో