Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
- కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై రచ్చ
- పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- ఈ అంశంపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది
- హైకమాండ్లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్కు చర్య తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్లో ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా మీడియా ప్రతినిధులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది. హైకమాండ్లో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ నిర్ణయాన్ని హైకమాండ్కే వదిలేయాలి. కానీ ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించడానికి ప్రతయత్నించకూడదు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
READ MORE: Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
Also Read
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ఊహాగానాల మధ్య. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన “హైకమాండ్” వ్యాఖ్యపై బీజేపీ వ్యాంగంగా స్పందించింది. ఖర్గే కాకపోతే “పార్టీ హైకమాండ్” ఎవరు అని యంగ్ ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫాంలో ఓ పోస్ట్ చేశారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్ రూపురేఖలు లేనిది. అది ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అధిష్ఠానం అని ప్రజలు భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా అది తాను కానని అంటున్నారు’’ అని రాసుకొచ్చారు.
READ MORE: MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..
కాగా.. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లను తోసిపుచ్చారు. ” డీకే శివకుమార్, నేను కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు శిలలాగా చెక్కుచెదరకుండా ఉంటుంది. బీజేపీ అబద్ధాలకు పేరుగాంచింది. వాళ్లు చేసే వ్యాఖ్యలపై మేము స్పందించము.” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?