Crime News: పరువు హత్య.. కూతురుని గడ్డివాములో వేసి కాల్చేసిన తండ్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని పలు రాష్ట్రాల్లో పరువు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో.. తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. పరువు కోసం కన్న కూతుళ్లనే అతి కిరాతంగా చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. వివాహం అయినా తన ప్రేమికుడ్ని తరచుగా కలుస్తుందన్న కోపంతో కూతురుని ఓ తండ్రి గడ్డివాములో వేసి కాల్చేచేశాడు. ఈ హత్య జరిగిన ఏడు నెలలకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని నంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మరవేమన గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… మరవేమన గ్రామానికి చెందిన రవి (41) కుమార్తె అర్పిత (17). ఆమె బంధువుల కుటుంబంలోని ఒక అబ్బాయిని ప్రేమించింది. వరుసకు అతను అన్న అవుతాడని, ప్రేమ వద్దని తల్లిదండ్రులు అర్పితను హెచ్చరించారు. అయినా కూతురు వినకపోవడంతో.. హడావుడిగా నరసాపురం ఫిర్కా ఓడి కృష్ణాపుర గ్రామానికి చెందిన ఒక యువకునికి ఇచ్చి వివాహం చేశారు. అర్పితకు తన భర్తతో సంసారం చేయడం ఇష్టపడలేదు. ఈ విషయంపై అర్పిత భర్త రవికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో రవి గత మే నెల 21న వెళ్లి కూతురుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Also Read: Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఛార్జీలు ఎక్కువే.. కనీస టికెట్ ధర 35!
మరవేమన ఊరి సమీపంలో ఉన్న ముష్టూరు గ్రామం వద్ద ఉన్న ఫారం హౌస్ వద్దఅర్పితను కొట్టిన రవి.. ఆపై గొంతు పిసికి చంపాడు. విషయం ఎవరికీ చెప్పకుండా ఓ గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అక్టోబరు చివరి వారంలో రవి పోలీస్ స్టేషన్కు వెళ్లి.. కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం రవి ప్రవర్తనపై అనుమానం రావడం, అదే సమయంలో ఒక ఆగంతకుడు స్టేషన్కు ఫోన్ చేసి రవి దురాగతాన్ని వివరించాడు. దాంతో రవిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టగా.. తానే కుమార్తెను హత్య చేశానని అంగీకరించాడు. అర్పిత భర్త, అతని కుటుంబ సభ్యులపై బాల్యవివాహాల చట్టాలకు అనుగుణంగా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?