Priyank Kharge : రాజకీయ దుమారం రేపుతున్న ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటకలోని చిత్తాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ప్రకటన దుమారం రేపుతోంది. ఈ ప్రకటనలో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ స్పందించారు. బజరంగ్దళ్ లేదా ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఆర్ఎస్ఎస్పై కూడా నిషేధం విధించవచ్చని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Read Also:NITI Aayog: నీతి ఆయోగ్ మీటింగ్ కు 9 మంది సీఎంలు డుమ్మా
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ప్రధాని మోదీ స్వయంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ అన్నారు. మేమంతా సంఘ్ వాలంటీర్లమే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వాలు నిషేధించాలని ప్రయత్నించాయని, కానీ ఎప్పటికీ విజయవంతం కాలేదని కటీల్ అన్నారు. బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్లను నిషేధించాలని మీరు (కాంగ్రెస్) ప్రయత్నిస్తే బూడిదలో పోసిన పన్నీరే అని కటీల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రియాంక్కి సలహా ఇస్తూ.. ముందుగా దేశ చరిత్ర తెలుసుకోవాలని, నాలుకపై కూడా శ్రద్ధ పెట్టాలని అన్నారు.
Read Also:Mahanadu 2023: 160 స్థానాల్లో గెలవడం.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..
ప్రియాంక్ ఖర్గే ప్రకటనతో రాజకీయాలు వేడెక్కాయి. దీన్ని బీజేపీ వ్యతిరేకించింది. పాఠశాల పాఠ్యాంశాల్లో మార్పులు, మత మార్పిడి నిరోధక చట్టం వంటి బీజేపీ ప్రభుత్వంలో చేసిన ఉత్తర్వులు, చట్టాలను సమీక్షిస్తామని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తే, ప్రభుత్వం దానిని సవరించడం లేదా ఉపసంహరించుకోవడం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రాగానే బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధించాలని కూడా రాశారు. ఇదే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగింది. ఈ అంశంపై కాంగ్రెస్పై బీజేపీ విరుచుకుపడింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!