Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొంత బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొరికిన దొంగలను అరెస్టు చేసి నేడు మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. దీ గోల్డెన్ థీఫ్ పేరుతో ఆపరేషన్ సాగినట్లు తెలిపారు. సుబోధ్ సింగ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల్లో ముఠా నడుస్తోందన్నారు. బంగారు నగల దుకాణాలు, బ్యాంకులను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. కరీంనగర్ దోపిడీలో రఘునాథ్ కర్మకార్ అలియాస్ జాగిరా సింగ్, రవిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమ్న్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమని కుమార్ అలియాస్ సనోజ్లు పాల్గొన్నట్టు సీపీ వివరించారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
“ఈ దుండగులు కరీంనగర్ దోపిడీ చేసి బైక్లపై పారిపోయారు.. మొత్తం గ్రామీణ రూట్ ఎంచుకున్నారు. బైకులు వదిలేసి బస్సులు, రైళ్లలో పారిపోయారు. వీళ్ళలో నలుగురు కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్ కి రఘునాథ్ కర్మకార్ లీడ్ చేశాడు. మొత్తం ప్లాన్ జైల్లో ఉన్న సుభోద్ సింగ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ గ్యాంగ్ ఒక ఎంటర్ ప్రైజ్ లెవల్లో నడుపుతున్నారు. ఇందులో ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు. మరో ఇద్దరు అసన్ సాల్ నుంచి వచ్చారు. దాదాపు నలభై ఐదు రోజులు రాష్ట్రంలో తిరిగారు. వివిధ పట్టణాల్లో తిరిగి.. చివరికి కరీంనగర్ ఎంచుకున్నారు. పక్కా ప్లాన్ తో దోపిడీ చేశారు. గూగుల్ మ్యాప్ లో ఆఫ్ లైన్ తీసుకున్నారు. ఈ గ్యాంగ్ పై పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి. సుబోధ్ సింగ్ ముఠా ఇప్పటి వరకు 400 కిలోల బంగారం దోపిడీ చేసినట్టు సమాచారం. ఇక్కడ షెల్టర్ తీసుకుంటే గుర్తుపడతారు అని ధర్మపురిలో బస చేశారు. రెక్కీ చేసినప్పుడు వీరి వద్ద ఆయుధాలు లేవు. వీరికి ఆయుధాలు దోపిడీకి ముందురోజు 6 పిస్టల్స్, 12 మాగ్జిన్స్ చంద్రపూర్లో వేరే ముఠా ఇచ్చింది. రెండు బైక్లు వాడారు. ఒక బైక్ వదిలేశారు. మరో ఇద్దరు సొత్తు తీసుకుని బైక్పై వెళ్లారు. గోదావరి దాటిన వాళ్ళు బస్సుల్లో వెళ్లారు. దొంగిలించిన సొత్తు తీసుకువెళ్లిన వారు అడవి బాటలో వెళ్లి ఇంకో ముఠాకి సొత్తుని అప్పగించారు. అక్కడ నుంచి వారు కూడా విడిపోయారు. ఈ ఘటనపై ఇంకా విచారణ సాగుతుంది. గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్ పూర్ణియా జిల్లాలో ఉన్నాడు. పీటీ వారెంట్పై పట్టుకుని వస్తాం. ఈ దోపిడీలో పాల్గొన్న వారిపై గతంలో దోపిడీ కేసులున్నాయి. మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చారు. అవే పేర్లను కూడా వాడారు. ఈ గ్యాంగ్ లో ఉన్న సభ్యులకు ఒకరి పేరు మరొకరికి తెలియదు. ఊరు పేర్లు కూడా తెలియవు. వీరి సంప్రదింపులు అన్ని ఒక యాప్ ద్వారా జరుగుతుంది. వారి ఫీడ్ బ్యాక్, వారి డ్యూటీస్ అన్ని యాప్ లో షేర్ అవుతూ ఉంటాయి. దోపిడీకి టీమ్స్ వారీగా పని విభజన ఉంటుంది. ఏ టీమ్ కి మరో టీమ్ మెబర్స్ తెలియదు. పోలీస్ టీమ్స్ హార్డ్ వర్క్ చేశాయి.” అని సీపీ వెల్లడించారు.
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!