Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొంత బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొరికిన దొంగలను అరెస్టు చేసి నేడు మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. దీ గోల్డెన్ థీఫ్ పేరుతో ఆపరేషన్ సాగినట్లు తెలిపారు. సుబోధ్ సింగ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల్లో ముఠా నడుస్తోందన్నారు. బంగారు నగల దుకాణాలు, బ్యాంకులను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. కరీంనగర్ దోపిడీలో రఘునాథ్ కర్మకార్ అలియాస్ జాగిరా సింగ్, రవిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమ్న్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమని కుమార్ అలియాస్ సనోజ్లు పాల్గొన్నట్టు సీపీ వివరించారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
“ఈ దుండగులు కరీంనగర్ దోపిడీ చేసి బైక్లపై పారిపోయారు.. మొత్తం గ్రామీణ రూట్ ఎంచుకున్నారు. బైకులు వదిలేసి బస్సులు, రైళ్లలో పారిపోయారు. వీళ్ళలో నలుగురు కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్ కి రఘునాథ్ కర్మకార్ లీడ్ చేశాడు. మొత్తం ప్లాన్ జైల్లో ఉన్న సుభోద్ సింగ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ గ్యాంగ్ ఒక ఎంటర్ ప్రైజ్ లెవల్లో నడుపుతున్నారు. ఇందులో ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు. మరో ఇద్దరు అసన్ సాల్ నుంచి వచ్చారు. దాదాపు నలభై ఐదు రోజులు రాష్ట్రంలో తిరిగారు. వివిధ పట్టణాల్లో తిరిగి.. చివరికి కరీంనగర్ ఎంచుకున్నారు. పక్కా ప్లాన్ తో దోపిడీ చేశారు. గూగుల్ మ్యాప్ లో ఆఫ్ లైన్ తీసుకున్నారు. ఈ గ్యాంగ్ పై పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి. సుబోధ్ సింగ్ ముఠా ఇప్పటి వరకు 400 కిలోల బంగారం దోపిడీ చేసినట్టు సమాచారం. ఇక్కడ షెల్టర్ తీసుకుంటే గుర్తుపడతారు అని ధర్మపురిలో బస చేశారు. రెక్కీ చేసినప్పుడు వీరి వద్ద ఆయుధాలు లేవు. వీరికి ఆయుధాలు దోపిడీకి ముందురోజు 6 పిస్టల్స్, 12 మాగ్జిన్స్ చంద్రపూర్లో వేరే ముఠా ఇచ్చింది. రెండు బైక్లు వాడారు. ఒక బైక్ వదిలేశారు. మరో ఇద్దరు సొత్తు తీసుకుని బైక్పై వెళ్లారు. గోదావరి దాటిన వాళ్ళు బస్సుల్లో వెళ్లారు. దొంగిలించిన సొత్తు తీసుకువెళ్లిన వారు అడవి బాటలో వెళ్లి ఇంకో ముఠాకి సొత్తుని అప్పగించారు. అక్కడ నుంచి వారు కూడా విడిపోయారు. ఈ ఘటనపై ఇంకా విచారణ సాగుతుంది. గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్ పూర్ణియా జిల్లాలో ఉన్నాడు. పీటీ వారెంట్పై పట్టుకుని వస్తాం. ఈ దోపిడీలో పాల్గొన్న వారిపై గతంలో దోపిడీ కేసులున్నాయి. మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చారు. అవే పేర్లను కూడా వాడారు. ఈ గ్యాంగ్ లో ఉన్న సభ్యులకు ఒకరి పేరు మరొకరికి తెలియదు. ఊరు పేర్లు కూడా తెలియవు. వీరి సంప్రదింపులు అన్ని ఒక యాప్ ద్వారా జరుగుతుంది. వారి ఫీడ్ బ్యాక్, వారి డ్యూటీస్ అన్ని యాప్ లో షేర్ అవుతూ ఉంటాయి. దోపిడీకి టీమ్స్ వారీగా పని విభజన ఉంటుంది. ఏ టీమ్ కి మరో టీమ్ మెబర్స్ తెలియదు. పోలీస్ టీమ్స్ హార్డ్ వర్క్ చేశాయి.” అని సీపీ వెల్లడించారు.
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!