NTV Telugu Site icon

US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య

720

720

కుటుంబ సమస్యలు హత్యకు దారి తీశాయి. కరంజిత్ ముల్తానీ అనే వ్యక్తి.. తన సోదరుడ్ని కాల్చి చంపగా.. అడ్డొచ్చిన తల్లిని కాల్చడంతో ఆమె గాయపడింది. అనంతరం నిందితుడు తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం శనివారం న్యాయార్క్‌లో చోటుచేసుకుంది.

న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్ జిల్లాలోని క్వీన్స్ హోమ్‌లో కరంజిత్ ముల్తానీ (౩౩) కుటుంబం నివాసం ఉంటుంది. ఇతనికి ముగ్గురు పిల్లలు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. బిజినెస్ దెబ్బతినడంతో ఆర్థికంగా సతమతం అవుతున్నాడు. దీంతో కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. పైగా కుటుంబ సభ్యులు ఎగతాళిగా మాట్లాడడం.. కరంజిత్‌కు కోపాన్ని తెప్పించింది. ఇదే విషయంపై శనివారం మరోసారి ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆవేశంలో కరంజిత్ తుపాకీ తీసుకుని తన సోదరుడైన విపన్‌పాల్ ముల్తానీ (27)ని కాల్చి చంపాడు. అడ్డుకోబోయిన తల్లిపైన కాల్పులు జరిపాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కరంజిత్ మృతదేహం వీధిలో ప్రత్యక్షమైంది. కాల్పులు అనంతరం అతడు ఇంట్లో నుంచి పారిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. అతని తలపై గాయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విపన్‌పాల్‌పై తొమ్మిది సార్లు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. ఇక తల్లి చేయి, మొండెంపై గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఇరుగుపొరుగు వారు ఆశ్యర్యపోయారు. ఎప్పుడూ గొడవ పడినట్లుగా తెలియదని చెప్పారు. న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ నేరంపై దర్యాప్తు చేస్తోంది.