Uttarpradesh : కోడి పెట్టిన చిచ్చు.. జైలు పాలైన రెండు వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కోడి కొట్టింది. కోపంతో ఆ వ్యక్తి కోడి యజమానిని తిట్టాడు. ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరుపక్షాల నుంచి మరికొంత మంది పోరాటానికి దిగారు. కర్రలతో కొట్టుకోవడంతో విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. ఇద్దరి మధ్య గొడవను చూసిన పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. విషయం కాన్పూర్లోని బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. కోడి కారణంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్దిసేపటికే ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరడంతో ఇరువర్గాల మధ్య కర్రలలో చిన్న పాటి యుద్ధం జరిగింది. అక్కడ ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించగా, ఇరువర్గాలకు పలుమార్లు వివరణ ఇచ్చినా ఇరువర్గాలు అంగీకరించకపోవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. కోడి యజమానిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read Also:Bangladesh: మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపే 16 మంది వీరే..విద్యార్థి నాయకులకు చోటు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరమావు నివాసి మహ్మద్ బక్రీది కోడిని సాధుకుంటున్నాడు. ఈ కోడిని వదిలిపెట్టినప్పుడు అది వీధిలో ప్రయాణిస్తున్న వారి పై దాడి చేస్తుంది. ఈ క్రమంలో గత బుధవారం మహ్మద్ బక్రీదీ పొరుగున నివాసముంటున్న ఇర్షాద్ వీధి నుంచి రాగానే కోడి తన ముక్కుతో దాడి చేసింది. ఈ విషయమై ఇర్షాద్ కోడి యజమానికి ఫిర్యాదు చేయడంతో వాగ్వాదానికి దిగాడు. విషయం తీవ్రస్థాయికి చేరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు లాఠీలతో కొట్టుకున్నారు. స్థానికుల వాగ్వాదం, వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో పోలీసులు కోడి యజమానిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చలాన్ చేశారు. కోడి యజమాని మహ్మద్ బక్రీదీ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కోడిని కట్టి ఉంచేవాడినని, ఆ రోజు తాను ఇంట్లో లేడని, తన కొడుకు పని నుంచి రాగానే గేటు తెరుస్తుండగా కోడి బయటకు వచ్చి పక్కింటివారి కాలుకు తగిలిందని చెప్పాడు. దాడి చేసిన కోడిని అస్సలు విడిచిపెట్టవద్దని, బోనులో బంధించాలని కోడి యజమానికి పోలీసులు కఠినంగా ఆదేశాలు ఇచ్చారని ఏసీపీ కల్యాణ్పూర్ అభిషేక్ పాండే చెబుతున్నారు.
Read Also:PR Sreejesh: హాకీ కిట్ కొనడానికి ఆవును అమ్మిన శ్రీజేశ్ తండ్రి.. ఆ రోజు ఏం చెప్పాడంటే?
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!