Kangana Ranaut: ప్రధాని మోడీని కలిసిన బాలీవుడ్ క్వీన్!
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈరోజు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఏడాది తన పుట్టినరోజును ఆమె అత్యంత ప్రత్యేకంగా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరుపుకున్నారు.
READ ALSO: War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్ పై దాడులకు బ్రేక్..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రధానితో చిరస్మరణీయ భేటీ..
తన పుట్టినరోజు సందర్భంగా కంగనా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కంగనా హిమాచల్ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రధానికి ఒక శాలువాను స్వయంగా కప్పారు. ఆమె సోదరుడు అక్షత్ రనౌత్.. ‘దశావతారాన్ని’ అద్భుతంగా చిత్రీకరించిన ఇత్తడి వాల్ ఫ్రేమ్ను ప్రధానికి బహుమతిగా అందజేశారు. ప్రధాని మోడీ కంగనా కుటుంబంతో సరదాగా గడిపారు. ముఖ్యంగా కంగనా మేనల్లుడితో ప్రధాని ఆడుకుంటున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. “ఈరోజు నా కుటుంబంతో పాటు గౌరవనీయ ప్రధానమంత్రి గారి సమయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందడం నా అదృష్టం. ఇది నాకు మర్చిపోలేని పుట్టినరోజు” అంటూ కంగనా తన పోస్ట్లో పేర్కొన్నారు.
రాజకీయాల్లో బిజీ.. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఎప్పుడంటే..
2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంగనా రాజకీయాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఆమె దర్శకత్వం వహించి నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అభిమానులు ఆమెను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంగనా చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో ‘తను వెడ్స్ మను’ వంటి హిట్స్ ఇచ్చిన ఆర్.మాధవన్తో కలిసి ఆమె రెండు సినిమాల్లో నటించనున్నారు. అందులో ఒక చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రాబోయే తను వెడ్స్ మను 3 హిట్ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో