Kanakamedala: ఏపీ పునర్విభజన హామీలు పూర్తి చేయాలని కోరాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజ్ నాథ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ బిజినెస్ పై మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ, సీపీసీ రీప్లేస్ తో పాటు జమ్మూ కాశ్మీర్ బిల్లులను కేంద్రం ప్రస్తావించింది అని ఆయన చెప్పారు. 22 పార్టీలు అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నాయి.. టీడీపీ తరపున అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలను లేవనెత్తాను.. ఏపీ ప్రభుత్వం పునర్విభజన పట్ల నిర్లక్షం వహించింది.. దాంతో అభివృద్ధి జరగలేదు అని కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు.
Read Also: Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
ఇక, మిగిలింది ఆరు నేలలు మాత్రమే.. అందుకే విభజన హామీలు పూర్తి చేయాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. పోలవరం పూర్తి చెయ్యాలి.. రాష్ట్ర రాజధాని లేకుండా ఉంది.. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడ్డ క్యాపిటల్ ను మారుస్తున్నారు.. ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి అని ఆయన కోరారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.. రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే కేంద్రం జోక్యం చేసుకోవాలి.. కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారు.. పాత ప్రభుత్వ నిర్ణయాలపై, కొత్త ప్రభుత్వం చేసే కక్ష్య సాధింపుపై పార్లమెంట్ లో చర్చ జరగాలి అని కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Krishna Water Issue: మినిట్స్ రూపంలో విడుదల చేస్తాం… కృష్ణా నీటిపై సీడబ్ల్యూసీ క్లారిటీ..
ఏపీలో ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకొని ఓటర్లను తొలగిస్తున్నారు అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. దొంగ ఓట్లను చేరుస్తున్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాం.. సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పాం.. ఏపీలో కరువు అంశం ఉంది.. కేంద్రం పరిష్కరించాలని అడిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలం అవడం వల్ల.. కేంద్ర పథకాల నిధులు వెనక్కి పోతున్నాయి.. అనేక ప్రాజెక్టులు ఏపీలో మూలన పడ్డాయి.. ఇక మిగిలింది.. ఆర్నేళ్లే.. అందుకే విభజన హామీలు పూర్తి చెయ్యాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల వెల్లడించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!