Kanakamedala: ఏపీ పునర్విభజన హామీలు పూర్తి చేయాలని కోరాం..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజ్ నాథ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ బిజినెస్ పై మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ, సీపీసీ రీప్లేస్ తో పాటు జమ్మూ కాశ్మీర్ బిల్లులను కేంద్రం ప్రస్తావించింది అని ఆయన చెప్పారు. 22 పార్టీలు అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నాయి.. టీడీపీ తరపున అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలను లేవనెత్తాను.. ఏపీ ప్రభుత్వం పునర్విభజన పట్ల నిర్లక్షం వహించింది.. దాంతో అభివృద్ధి జరగలేదు అని కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు.
Read Also: Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..
Also Read
- SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
ఇక, మిగిలింది ఆరు నేలలు మాత్రమే.. అందుకే విభజన హామీలు పూర్తి చేయాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. పోలవరం పూర్తి చెయ్యాలి.. రాష్ట్ర రాజధాని లేకుండా ఉంది.. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడ్డ క్యాపిటల్ ను మారుస్తున్నారు.. ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి అని ఆయన కోరారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.. రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే కేంద్రం జోక్యం చేసుకోవాలి.. కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారు.. పాత ప్రభుత్వ నిర్ణయాలపై, కొత్త ప్రభుత్వం చేసే కక్ష్య సాధింపుపై పార్లమెంట్ లో చర్చ జరగాలి అని కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Krishna Water Issue: మినిట్స్ రూపంలో విడుదల చేస్తాం… కృష్ణా నీటిపై సీడబ్ల్యూసీ క్లారిటీ..
ఏపీలో ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకొని ఓటర్లను తొలగిస్తున్నారు అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. దొంగ ఓట్లను చేరుస్తున్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాం.. సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పాం.. ఏపీలో కరువు అంశం ఉంది.. కేంద్రం పరిష్కరించాలని అడిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలం అవడం వల్ల.. కేంద్ర పథకాల నిధులు వెనక్కి పోతున్నాయి.. అనేక ప్రాజెక్టులు ఏపీలో మూలన పడ్డాయి.. ఇక మిగిలింది.. ఆర్నేళ్లే.. అందుకే విభజన హామీలు పూర్తి చెయ్యాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల వెల్లడించారు.
తాజావార్తలు
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!