Lok sabha election: ఫస్ట్ ఫేజ్లో అత్యంత ధనవంతడైన అభ్యర్థి ఎవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. వచ్చే వారమే తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఫస్ట్ ఫేజ్లో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ఎన్నికల అధికారికి అఫిడవిట్లు సమర్పించారు. అయితే అత్యంత ధనవంతులతో కూడిన 10 మంది జాబితాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. తొలి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్ మొదటి స్థానంలో నిలిచారు.

Also Read
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం మధ్యప్రదేశ్లోని చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్కు రూ.717 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే నేత అశోక్ కుమార్ రూ.662 కోట్లతో సెకండ్ స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో తమిళనాడులో శివగంగ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cruel Mother: ప్రియుడి మోజులో పడి.. కన్న పిల్లలను చంపేసిన కసాయి తల్లి
లోక్సభ ఎన్నికలకు ముందు కమల్నాథ్ పార్టీ మారతారని పెద్ద ప్రచారమే జరిగింది. ఆయన బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత ఇలాంటి వార్తలు వినిపించాయి. ఇక ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కమల్నాథ్ను తన మూడో కుమారుడు అని ఇందిరా ఉదహరించేవారు. మొత్తానికి ఆయన పార్టీ మారలేదు. పుకార్లకు ఫుల్స్టాప్ పడింది. అలాగే కుమారుడి సీటు విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే జరిగింది. కానీ చింద్వారా లోక్సభ సీటు నకుల్నాథ్కే లభించింది.
ఇది కూడా చదవండి: RT75 : అలాంటి పాత్రలో కనిపించబోతున్న రవన్న.. రచ్చ రచ్చే..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభంకానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. తొలి విడతలో భాగంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక రెండు విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది.

తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!