Indore : 21 ఏళ్ల క్రితం చనిపోయిన మామ.. కట్నం కోసం వేధిస్తున్నాడని కాజల్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore : మహారాష్ట్రలో నివసిస్తున్న శివ, కాజల్ను ఇండోర్లో 4 సెప్టెంబర్ 2013న వివాహం చేసుకున్నాడు. కాజల్ తండ్రి గతంలో మహారాష్ట్రలో ఉద్యోగం చేసేవారు. వీఆర్ఎస్తో తన మకాం ఇండోర్కు మార్చుకున్నాడు. శివ, కాజల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన కొద్ది రోజుల పాటు అంతా సజావుగా సాగింది. కాజల్కి తన గురించి ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. తనను ఎయిర్ హోస్టెస్ కోర్సు చేయడానికి అనుమతించమని ఆమె తన భర్తయిన శివను కోరింది. అందుకు భర్త కూడా అంగీకరించాడు. ఆమె చదువుల కోసం పది లక్షలు కూడా వెచ్చించాడు. కాజల్ కోర్సు పూర్తయింది. ఇప్పుడు ఆమె ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించింది. కానీ శివ ఆమెను ఎక్కడికీ వెళ్లనివ్వలేదు.
Read Also:Perni Nani: టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఇంతలో కాజల్ గర్భిణి కావడంతో.. డెలివరీ నిమిత్తం ఇండోర్ వచ్చింది. ఉద్యోగానికి తన భర్త అనుమతి ఇవ్వలేదని పేరెంట్స్ వద్ద వాపోయింది. అందుకే ఇంటికి రాగానే ఫోన్ ఆఫ్ చేసింది. ఆమెకు డెలివరీలో కుమార్తె పుట్టింది. కొన్ని రోజుల తర్వాత, కాజల్ తన లాయర్ల ద్వారా ఇండోర్ జిల్లా కోర్టులో తన భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఇండోర్ జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 13, 2023న, కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 10, 2023న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు సమన్లు అందడంతో శివకు విషయం తెలిసింది. శివ ఇండోర్ వచ్చాడు. తన భార్య కాజల్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును మోసం చేసిందని తన లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా కోర్టుకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో కోర్టు కూడా అయోమయంలో పడింది.
Read Also:Simhadri: రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్… ఇదెక్కడి అరాచకం సామీ
15 లక్షల కట్నం కోసం భర్త, అత్తమామలు, తనను వేధిస్తున్నారని కాజల్ కోర్టుకు తెలిపింది. దీని ప్రకారం, కోర్టు ఫిబ్రవరి 13, 2023న ముగ్గురిపై సమన్లు జారీ చేసింది. అయితే కాజల్కు పెళ్లి కాకముందే శివ తన తండ్రి చనిపోయాడని లాయర్ ప్రీతి మెహ్రా ద్వారా శివ కోర్టుకు తెలియజేశాడు. తన తండ్రి ఫిబ్రవరి 14, 2002న చనిపోయాడని.. తను చనిపోయి 21 ఏళ్లు అవుతుందని శివ కోర్టుకు తెలియజేశాడు. తన తండ్రి మరణ పత్రాలను కూడా కోర్టు ముందు సాక్ష్యంగా సమర్పించాడు. భార్య కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని తెలిపాడు. తనపై, చనిపోయిన తన తండ్రిపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. దీని తర్వాత తప్పుడు దరఖాస్తును సమర్పించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సమయం వృధా చేశారంటూ కాజల్పై శివ, అతని తల్లి పిటిషన్ వేశారు. మరికొద్ది రోజుల్లో ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది. అయితే ఈ కేసును కోర్టు ఎలా విచారిస్తుందనేది ముఖ్యం.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!