Kadiyam Srihari : కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లే ముందు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోందన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తెలంగాణ నదీ జలాలపై కేంద్రం ఆక్రమణలకు పాల్పడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే నదుల నిర్వహణను కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులకు అప్పగించింది. తెలంగాణ రైతుల భవిష్యత్తును అంధకారంలో పడేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళం విప్పిందని అన్నారు.
Kejriwal: ఢిల్లీలో కాంగ్రెస్కు ఆప్ ఇచ్చిన ఆఫర్ ఇదే!
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
నదీజలాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని, తెలంగాణను ఎడారిగా మారుస్తామని కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం మంచిది కాదన్నారు. కరెంటు కష్టాలు కూడా తప్పవని అన్నారు. బీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేదని హెచ్ 3 దుయ్యబట్టారు. ప్రజలకు కాంగ్రెస్ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాలు, కేంద్రానికి అప్పగిస్తే జరిగే నష్టాలపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వివరిస్తారని చెప్పారు. తెలంగాణ నదీ జలాల పెంపునకు కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని తేల్చిచెప్పారు. ఈరోజు ప్రారంభించిన జల ఉద్యమం తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామన్నారు.
Pakistan: పాక్ ఎన్నికలపై వివాదం.. రిగ్గింగ్ జరిగిందని దాఖలు చేసిన 30 పిటిషన్లు తిరస్కరణ
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!