Kadiyam Srihari : సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదు
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం ను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త లాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే చాలా భాద అనిపిస్తుందన్నారు కడియం శ్రీహరి. మీరు తిడుతుంటే…మేము పడుతూ ఉంటామా?.. మాకు కూడా చీము,నెత్తురు ఉన్నదిగా….మేము కూడా ఎదో ఒక భాషలో తిట్టాలాగా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్- హరీష్ రావు లను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని, రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
సభ్యత సంస్కారం తెలుసుకొని రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదన్నారు. బీఆర్ఎస్ ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యాతో కూడా కాదన్నారు. పాలకుర్తి నియోజకవర్గం BRS విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డిలో ఎలాంటి మార్పు కనపడటం లేదన్నారు కడియం శ్రీహరి. సీఎంగా ఉన్నప్పుడు కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు ఎంతో హుందాగా ప్రవర్తించారని గుర్తు చేశారు. పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసిన కేసీఆర్ను ఇష్టమున్నట్టు తిట్టడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభం అయిందని తెలిపారు. కేసీఆర్ను అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని అన్నారు. ఇక.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!