KA Paul: ముక్కు సూటిగా అవినాష్ రెడ్డిని ప్రశ్నలు అడిగా.. ఆయనకు న్యాయం జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది.. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతుండగా.. ఆ స్పత్రికి వెళ్లి కేఏ పాల్.. శ్రీలక్ష్మిని పరామర్శించారు.. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ వివేకా కేసులో తాజాగా వైఎస్ విమలాదేవి హార్ట్ టచ్ వీడియో చూశానని తెలిపారు పాల్.. నేను టర్కీ వెళ్లాల్సి ఉంది.. కానీ, అవినాష్ రెడ్డి తల్లిని చూడాలని కర్నూలుకు వచ్చానని తెలిపారు.. ఆస్పత్రిలో అవినాష్రెడ్డిని కలిసి సందర్భంగా నేను ముక్కు సూటిగా అవినాష్ ని కొన్ని ప్రశ్నలు అడిగానని.. కానీ, వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు వెల్లడించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- India Independence: భారత్కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- WhatsApp Scam Alert: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక, మోసగాళ్ల చెక్..!
- BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
అయితే, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అవినాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు కేఏ పాల్.. ఎప్పుడు పిలిచినా సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పారన్నారు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుకున్నారు పాల్.. అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని హితవుపలికారు.. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాక్షించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. కాగా, 16వ తేదీ సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్ రెడ్డి.. 19వ తేదీన తన తల్లికి అనారోగ్యమంటూ మరోసారి విచారణకు రాలేదు. పులివెందులలో అనారోగ్యంపాలైన తన తల్లి శ్రీలక్ష్మిని అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తారని అంతా భావించారు.. అయితే, కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు అవినాష్రెడ్డి.. 22వ తేదీన మళ్లీ విచారణకు రావాలని సీబీఐ కోరింది.. తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు రాలేనని ఎంపీ అవినాష్రెడ్డి కోరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
India Independence: భారత్కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!