Israel Attack On Gaza : కాల్పుల విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న యుద్ధం.. గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 100 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Attack On Gaza : కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరుకుంది. మరణించిన వారిలో చాలా మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం ప్రకటించబడింది. ఈ విషయాన్ని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ప్రకటించారు. 15 నెలలుగా కొనసాగుతున్న విధ్వంసక యుద్ధాన్ని ముగించి, అనేక మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి ఈ కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ మరుసటి రోజే, అంటే గురువారం, ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 ఆదివారం నుండి అమల్లోకి వస్తుందని అల్ సాని తెలిపారు. కానీ ఇజ్రాయెల్ దీనికి ముందే దానిని ఉల్లంఘించింది.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 15 నెలలుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ముగిసిపోతుందని అనిపించింది కానీ అది జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇద్దరూ అంగీకరించారు. నవంబర్ 2023లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ జరిగింది. ఈ కాలంలో గాజా నుండి 100 మందికి పైగా బందీలను విడుదల చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also:Realme Buds Wireless 5 ANC: సరసమైన ధరలో అదిరిపోయే ఫీచర్స్తో వచ్చేసిన రియల్మి నెక్బ్యాండ్
ఒప్పందంపై నెతన్యాహు ఏమి చెప్పారు?
కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ తన కొత్త డిమాండ్లను వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పుడు కాల్పుల విరమణపై సమావేశం ఉండదు. దీనిపై యుద్ధ మంత్రివర్గం ఇప్పుడు నిర్ణయం తీసుకోదు. గాజాలో హమాస్ వెనక్కి తగ్గాల్సి ఉంటుందని ఆయన అన్నారు. హమాస్ తన వాగ్దానాలను ఉల్లంఘిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని ఈ ప్రకటన తర్వాత హమాస్ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరించింది.
ఇవి కాల్పుల విరమణ నిబంధనలేనా?
* నెట్జారిమ్ కారిడార్ నుండి 700 మీటర్లు వెనక్కి తీసుకోనున్న ఐడిఎఫ్
* ఇజ్రాయెల్ ఒక వారంలో రఫా సరిహద్దు క్రాసింగ్ను తెరుస్తుంది
* ప్రతిరోజూ 50 మంది గాయపడిన యోధులను హమాస్కు అప్పగిస్తాం.
* ఇజ్రాయెల్ దాదాపు 3,000 మంది యోధులను విడుదల చేయనుంది.
* ప్రతిగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది.
Read Also:Ajith Kumar : సంక్రాంతికి వాయిదా పడిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
గత 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం
హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇందులో 1200 మంది మరణించారు. 250 మంది బందీలుగా ఉన్నారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్పై భారీగా బాంబు దాడి చేసింది. గాజాలో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించింది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 46 వేలకు పైగా ప్రజలు మరణించారు. అక్కడి జనాభాలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మానవతా సంక్షోభం తలెత్తింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!