Juniper Hotels IPO: జునిపర్ హోటల్స్ ఐపీవో.. రూ.1800 కోట్లు సమీకరించేందుకు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Juniper Hotels IPO: లగ్జరీ హోటల్స్ డెవలప్మెంట్ కంపెనీ జూనిపర్ హోటల్స్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతోంది. ఐపీవోను ప్రారంభించేందుకు కంపెనీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్ (డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది. జునిపర్ హోటల్స్ సరాఫ్ హోటల్స్, జునిపర్ ఇన్వెస్ట్మెంట్స్, హయత్ హోటల్స్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది.
Read Also:Room Rent: ఏంటి ఒక్క రాత్రికి రూ.14లక్షలా.. అంతలా ఏముందో..!
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
జునిపర్ హోటల్స్ రూ.10 ముఖ విలువతో తాజా ఈక్విటీని జారీ చేస్తుంది. ఐపీవో ద్వారా రూ.1800 కోట్లు సమీకరించబడతాయి. ఈ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండదు. అంటే ప్రమోటర్లు లేదా పెట్టుబడిదారులు తమ వాటాను విక్రయించరు. ఐపీవోలో సంస్థాగత పెట్టుబడిదారులకు 75 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 15 శాతం ఈక్విటీ జారీ చేయబడుతుంది. డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం, ఐపీవో ద్వారా సేకరించిన మొత్తంలో కంపెనీ 1500 కోట్ల రూపాయలతో రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.
Read Also:Wife Birthday: భర్తలు అలర్ట్.. భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే..!
జునిపెర్ హోటల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ ఎండీ అరుణ్ కుమార్ సరాఫ్, వరుణ్ సరాఫ్ హోటల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన హోటళ్ల అభివృద్ధి, ఆస్తి నిర్వహణకు బాధ్యత వహిస్తుంటారు. భారతదేశంలో హయత్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన ఏకైక హోటల్ డెవలప్మెంట్ కంపెనీ జునిపర్ హోటల్స్. సరాఫ్ గ్రూప్, హయత్ నాలుగు దశాబ్దాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. 1982లో రాజధాని న్యూఢిల్లీలో తొలి హయత్ హోటల్ ప్రారంభమైంది. కంపెనీ భారతదేశం,నేపాల్లో 12 హోటళ్లను అభివృద్ధి చేసింది. వీటిపై జునిపెర్ యాజమాన్య హక్కులు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.827.8 కోట్లు కాగా, 2021-22లో రూ.188 కోట్లతో పోలిస్తే కంపెనీ నష్టం రూ.1.2 కోట్లకు తగ్గింది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సీఎల్ఎస్ఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఐపీవో బుక్ రన్నింగ్ లీడర్ మేనేజర్లుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!