Site icon NTV Telugu

Jogi Ramesh: ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారు.. జోగి రమేష్ ఫైర్

Jogi Ramesh1

Jogi Ramesh1

మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డాయి. ఆయన నివాసానికి నిప్పు పెట్టి రాళ్లు రువ్వుతూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపాయి. ఈ ఘటనపై జోగి రమేష్ స్పందించారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. నా ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేస్తారా? గంజాయి బ్యాచ్‌ను నా ఇంటిపైకి పంపుతారా.? అని ఫైర్ అయ్యారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో. నీ పిల్ల చేష్టలు, క్షణికానందం మానుకో అంటూ జోగి రమేష్‌ మండిపడ్డారు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి జోగి మోహనరావు, సతీమణి జోగి శకుంతల దేవి , చిన్న కుమారుడు జోగి రోహిత్.
YouTube video player

Exit mobile version