Jogi Ramesh: జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను!
- కననదుర్గమ్మ గుడిలో జోగి రమేశ్ ప్రమాణం
- కుటుంబ సభ్యులతో కలిసి గుడికి జోగి రమేశ్
- ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కననదుర్గమ్మ గుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమాణం చేశారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకున్న జోగి రమేశ్.. కల్తీ మద్యం కేసులో తనకే సంబంధం లేదన్నారు. మద్యం కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన మనసు బాధ కలిగించారన్నారు. ‘జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అమ్మ వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు.
‘కొండపై కనకదుర్గమ్మ, కొండ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా.. నిబద్ధతతో నిజాయితీతో నిండు మనస్సుతో చెప్తున్నా.. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. జోగి రమేష్ అనే నేను.. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా.. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నా. ఏడు కొండలు సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కుటుంబ సభ్యులను అడిగాను. నేను తప్పు చేయలేదని నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను తప్పు చేయలేదు నిబద్ధతతో నిజాయితీతో చెప్తున్నా. ముఖ్యమంత్రికి, సీఎం తనయుడికి చెప్తున్నా. మీడియా సమక్షంలో కల్తీ మద్యం గురించి రాష్ట్ర ప్రజలకు నా నిజాయితి చూపించాను. ఎవరో తెలియని పాపాన్ని నాకు అంటిస్తున్నారు’ అని జోగి రమేశ్ మీడియాతో అన్నారు.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
Also Read: Nara Lokesh: సీఎంకు ప్రధాని ఫోన్.. మంత్రి నారా లోకేష్కు కీలక బాధ్యతలు!
‘సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరిని తిరుమల రావాలని 10 రోజులుగా అభ్యర్థించా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పాలని అడిగా స్పందించలేదు. ఎవడో ఇబ్రహీంపట్నంలో పుట్టిన వాడు చెప్పింది విని నన్ను దోషి అంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో నా పేరు లేదు, కోర్టులో నా పేరు చెప్పలేదు, దక్షిణాఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నా పేరు లేదు. సిట్ అధికారులు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే.. ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టు కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దు. మీకు బార్య, పిల్లలు ఉన్నారు.. ఈరోజుతో ఇదంతా ఆగిపోదు’ అని మాజీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!