World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ , పాకిస్తాన్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి బలమైన స్థితికి చేరుకుంది. అంతకుముందు పాకిస్తాన్ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, ప్రస్తుతం 195 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జట్టు చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండటంతో ఆధిక్యం మరింత పెరిగే అవకాశం ఉంది. జార్డన్ కాక్స్ తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, 112 బంతుల్లో 10 ఫోర్లతో 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్తో జో రూట్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. WTC లో కెప్టెన్గా 3000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టిన రూట్, WTC లో ఇప్పటివరకు 34 మ్యాచ్లలో 63 ఇన్నింగ్స్లు ఆడి 50.4 సగటుతో మొత్తం 3024 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 40 మ్యాచ్ల్లో 2182 పరుగులు చేయగా, రూట్ అతనికంటే చాలా ముందంజలో ఉన్నాడు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
మరొకవైపు, WTC లో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలను వెనక్కి నెట్టి ఐదవ స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజమ్ 20 మ్యాచ్ల్లో 56.41 సగటుతో 1918 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 1349 పరుగులతో ఆరవ స్థానంలో, రోహిత్ శర్మ 1254 పరుగులతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ , రోహిత్ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
WTC లో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లలో జో రూట్ (3024) అగ్రస్థానంలో ఉండగా, బెన్ స్టోక్స్ (2182) రెండవ స్థానంలో, దిముత్ (2160) మూడవ స్థానంలో, క్రెగ్ బ్రాత్వైట్ (1994) నాలుగవ స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (1918), విరాట్ కోహ్లీ (1349), టామ్ లేథమ్ (1338), రోహిత్ శర్మ (1254) వరుసగా తదుపరి స్థానాల్లో నిలవగా, ధనంజయ డి సిల్వా (1099), నజ్ముల్ హుస్సేన్ శాంటో (1099) చివరి స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?