JNU: జపాన్ పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులు.. తర్వాత ఏమైందంటే?
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఘటన
- ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- విచారణ చేపట్టిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ
- నిజమని తేలడంతో ప్రొఫెసర్ తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
అసలేం జరిగిందంటే..
జపాన్కు చెందిన ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తోంది. యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె జపాన్ తిరిగి వెళ్లిన అనంతరం ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది.
READ MORE: HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్
దీంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నమ్మదగినవిగా గుర్తించింది. దీని తరువాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిందితుడైన ప్రొఫెసర్ను తొలగించాలని సిఫార్సు చేసింది. నిందితుడికి విశ్వవిద్యాలయ అప్పీలేట్ కమిటీ ముందు అప్పీల్ చేసుకునే హక్కు లేదా కోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉందని వర్గాలు తెలిపాయి.
READ MORE: Supreme Court : డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇదిలా ఉండగా.. ఒక పరిశోధన ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై పర్యావరణ శాస్త్ర విభాగానికి చెందిన మరో అధ్యాపక సభ్యుడిని సైతం తొలగించారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి పంపారు. ఈ ప్రాజెక్టుపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక తర్వాత ఇద్దరు బోధనేతర సిబ్బందిని కూడా తొలగించారు. ఇతరులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!