JNU: జపాన్ పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులు.. తర్వాత ఏమైందంటే?
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఘటన
- ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- విచారణ చేపట్టిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ
- నిజమని తేలడంతో ప్రొఫెసర్ తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
అసలేం జరిగిందంటే..
జపాన్కు చెందిన ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తోంది. యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె జపాన్ తిరిగి వెళ్లిన అనంతరం ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది.
READ MORE: HP Omen Max 16: HP నుంచి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ విడుదల.. రూ. 10 వేల క్యాష్ బ్యాక్
దీంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నమ్మదగినవిగా గుర్తించింది. దీని తరువాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిందితుడైన ప్రొఫెసర్ను తొలగించాలని సిఫార్సు చేసింది. నిందితుడికి విశ్వవిద్యాలయ అప్పీలేట్ కమిటీ ముందు అప్పీల్ చేసుకునే హక్కు లేదా కోర్టును ఆశ్రయించే హక్కు కూడా ఉందని వర్గాలు తెలిపాయి.
READ MORE: Supreme Court : డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇదిలా ఉండగా.. ఒక పరిశోధన ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై పర్యావరణ శాస్త్ర విభాగానికి చెందిన మరో అధ్యాపక సభ్యుడిని సైతం తొలగించారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి పంపారు. ఈ ప్రాజెక్టుపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక తర్వాత ఇద్దరు బోధనేతర సిబ్బందిని కూడా తొలగించారు. ఇతరులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!