Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్ చేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ పరిణామంతో హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ మీడియాలో బర్నింగ్ టాఫిక్గా మారింది.
రాంచీలో హేమంత్ ప్రత్యక్షం..
మంగళవారం మధ్యాహ్నం హేమంత్ సోరెన్ రాంచీలో సడన్గా ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావాలని ముందుగానే ముఖ్యమంత్రి ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈడీ అధికారులు వెంటాడుతుండడంతో అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనతోనే హేమంత్ ఎమ్మెల్యేలను పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్కు ముందుగానే తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు హేమంత్ పిలిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సీఎం నివాసానికి చేరుకున్నారు. వారం రోజులు రాంచీలోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీలో మకాం వేసేశారు.
Also Read
- 185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
- APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
సీఎంగా కల్పనా..
మరికాసేపట్లో హేమంత్ సోరెన్ అధ్యక్షతన కూటమి ఎమ్మెల్యేలంతా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా హేమంత్ భార్య కల్పనా సోరెన్ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం అస్థితర పడకుండా ఉండేందుకు హేమంత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
హేమంత్ భయపడుతున్నారు: దూబే
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ మిస్సింగ్పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హేమంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి బాధ్యతలు హేమంత్ సతీమణి కల్పనకు అప్పగించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..