UP: “ఆమె కొడుకే సర్వస్వం..” తల్లి ప్రాణం తీసిన పబ్జీ.. ఎంతకీ ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది. కుమారుడు ఎంతకీ మానకపోవడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రవీంద్ర ప్రతాప్ సింగ్ భార్య షీలా సింగ్ (38)గా గుర్తించారు. ఆమె చిత్రకూట్ జిల్లా రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని హర్దౌలి గ్రామానికి చెందినవారు. ఆమె కుటుంబం ఝాన్సీలోని ఆర్ఎస్ రెసిడెన్సీ కాలనీలో నివసిస్తోంది. ఆమె భర్త రవీంద్ర ప్రతాప్ సింగ్ హెచ్డీబీ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి 13 ఏళ్ల కుమారుడు అరిహన్స్ జై ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తన కొడుకు ఆన్లైన్లో PUBG గేమ్ ఆడటం, టీవీ చూడటం అలవాటు చేసుకున్నాడని రవీంద్ర వివరించాడు. దీని కారణంగా.. తన భార్య షీలా ఎప్పుడూ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందేదని తలిపాడు. ఈ ఆటలు బంద్ చేయమని పదే పదే తన కుమారుడికి చెప్పిన వినిపించుకోలేదని వెల్లడించాడు. కుమారుడే తన ఆస్తిగా భావించిన ఆ తల్లి తట్టుకోలేకపోయిందని చెబుతున్నారరు. గత ఆదివారం రాత్రి భోజనం తర్వాత.. అందరూ నిద్రపోయారు. రవీంద్ర తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మేల్కొన్నాడు. దీంతో షీలా గదిలో ఉచ్చుకు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా మహిళను మెడికల్ కాలేజీకి తరలించామని, ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారని రక్సా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రూపేష్ కుమార్ తెలిపారు. మృతదేహానికి పోస్టు మర్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!