JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

  • జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
  • సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అందుబాటులో
  • ఏప్రిల్ 2 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహణ
  • అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక సూచనలు
Jee Mains

Jee Mains

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 రెండో సెషన్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ నెలలో జరగనున్న ఈ కీలక పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది అభ్యర్థులు తమకు ఏ నగరంలో పరీక్షా కేంద్రం కేటాయించారో ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అయితే, ఇది కేవలం పరీక్షా నగరాన్ని తెలియజేసే స్లిప్పు మాత్రమేనని, దీనిని అడ్మిట్ కార్డ్‌గా భావించవద్దని అధికారులు సూచించారు.

Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

ఎన్‌టీఏ ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించడానికి , పారదర్శకత కోసం అభ్యర్థులకు ముందస్తుగానే పరీక్షా నగరాలపై అవగాహన కల్పించేందుకు ఈ స్లిప్పులను విడుదల చేశారు. పరీక్షకు రెండు లేదా మూడు రోజుల ముందు అభ్యర్థుల పూర్తి వివరాలు, పరీక్షా కేంద్రం చిరునామా , సమయంతో కూడిన ఒరిజినల్ ‘అడ్మిట్ కార్డులు’ విడుదల కానున్నాయి. అభ్యర్థులు పరీక్షా రోజున ఖచ్చితంగా అడ్మిట్ కార్డుతో పాటు ఒక చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని నిబంధనలు విధిస్తున్నారు.

Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరవుతున్నారు. జనవరిలో జరిగిన మొదటి సెషన్ ఫలితాల అనంతరం, రెండో సెషన్‌లో తమ స్కోరును మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 8తో పరీక్షలు ముగిసిన తర్వాత, కొద్ది రోజుల్లోనే ప్రాథమిక కీ (Provisional Key) విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి తుది ఫలితాలు , జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థుల జాబితాను ఎన్‌టీఏ ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరుతున్నారు.