Janga Krishna Murthy Likely To Join TDP: శాసనసభ, లోక్సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Kesineni Nani: పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా: కేశినేని నాని
ఇప్పటికే పల్నాడులోని టీడీపీ కీలక నాయకులతో జంగా కృష్ణమూర్తి భేటీ అయ్యారట. ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఏపీలో జంపింగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అభ్యర్థుల జాబితాలు వెలువడినప్పటి నుంచి.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ దక్కనివారు రాజీనామా చేసి.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.