Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jananayagan Leak: తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘జననాయగన్’ సినిమా పైరసీ కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసారు. సినిమా ఆన్లైన్ లీక్కు సంబంధించి నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!
Also Read
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. అతను మరో సినిమా ఎడిటింగ్ పనుల కోసం స్టూడియోకు వెళ్లిన సమయంలో.. అక్కడ ఉన్న ‘జననాయగన్’ సినిమా రీల్స్ను అనధికారికంగా యాక్సెస్ చేసి చోరీ చేశాడు. అలా దొంగిలించిన డేటాను పూర్తి స్థాయి సినిమాగా మార్చి, తన సహచరులకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్లే సినిమా ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యిందని అధికారులు నిర్ధారించారు.
ఈ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా ఈ ముగ్గురు కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన వేగవంతమైన దర్యాప్తుకు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.
TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
ఈ ఘటన సందర్బంగా ప్రజలకు సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలను జారీ చేసింది. ఇందులో పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ.. పైరసీ లింకులను ఫార్వార్డ్ చేసినా లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఎక్కడైనా పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింకులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఇందుకోసం నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి తెలపవచ్చని సైబర్ క్రైమ్ టీం తెలిపింది.
తాజావార్తలు
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!