Jakkampudi Raja: జక్కంపూడి రాజా దీక్ష భగ్నం.. 50 మంది హౌస్ అరెస్ట్!
- జక్కంపూడి రాజా దీక్ష భగ్నం
- 50 రాజా అనుచరులు మంది హౌస్ అరెస్ట్
- రాజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jakkampudi Raja’s House Arrest over Hunger Strike for Paper Mill workers: రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆమరణ దీక్షను ముందస్తుగా పోలీసులు భగ్నం చేశారు. నేటి నుండి ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆమరణ నిరాహారదీక్షకు జక్కంపూడి సిద్ధమయ్యారు. పేపరు మిల్లు గేటు ఎదురుగా ఉన్న కళ్యాణంలో దీక్ష చేయడానికి ఏర్పాట్లు చేసుకున్న సమయంలో భారీగా పోలీసులు అక్కడికి వచ్చారు. జక్కంపూడి రాజాను అరెస్టు చేసి ఇంటికి తరలించారు. రాజా ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
పేపర్ మిల్లుకు 500 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదనే నెపంతో జక్కంపూడి రాజాను పోలీసులు తరలించారు. రాజా అనుచరులు 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి రాజమండ్రి త్రీటౌన్ స్టేషన్కు తరలించారు. రాజమండ్రిలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున పేపర్ మిల్లు సమీపంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read
- LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
- సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
- Bill Gates: "అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది".. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
- Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పాదాల చెంత ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పారు. ‘పేపరు మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాలు కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదు. యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుంటాం’ అని సోమవారం జక్కంపూడి రాజా తెలిపారు.
తాజావార్తలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!