Tahir Anwar Death: “చచ్చాడా? చంపారా?”.. పాకిస్థాన్లో జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అనుమానాస్పద మృతి
Tahir Anwar Death: పాకిస్థాన్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాహీర్ అన్వర్ మరణాన్ని ఆ సంస్థ అధికారిక ఛానెల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం అర్థరాత్రి బహావల్పూర్లోని ‘జామియా మసీదు ఉస్మాన్ వలీ’లో అతని అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. తాహిర్ అన్వర్ జైష్-ఎ-మొహమ్మద్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఏళ్లుగా ఆ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. తాహిర్ అన్వర్ మరణానికి గల కారణంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అనారోగ్యం లేదా మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. భారతదేశంలో జరిగిన అనేక భారీ ఉగ్రవాద దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 19 మంది సైనికులను బలిగొన్న ఉరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన 2019 పుల్వామా దాడుల్లో ఈ సంస్థ పాత్ర ఉంది. ఇక గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ‘జామియా మసీదు సుభాన్ అల్లా’పై భారత్ జరిపిన దాడుల్లో ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది.
తాజావార్తలు
-
SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
-
Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్కు చెక్ పెట్టేందుకేనా ?
-
Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..
-
Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
-
Casting Couch : మంచం కింద ఇద్దరు హీరోలు.. పైన హీరోయిన్’తో ముసలి ప్రొడ్యూసర్ లీలలు! షాకింగ్ నిజాలు బయటపెట్టిన జేడీ!
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!