Jagga Reddy: క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సాయం అందిస్తా.. మీడియా ముందుకు ఎందుకొచ్చానంటే?
- క్యాన్సర్ పేషెంట్కు జగ్గారెడ్డి ఆర్థిక సహాయం
- సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు
- సంగారెడ్డి పట్టణంలో పేషెంట్కు 4 లక్షల రూపాయలు
- క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితం
- క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సాయం అందిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో క్యాన్సర్ పేషెంట్లు బతకడం లేదని, ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం చేశానని, రాష్ట్రంలోని దాతలు కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ రాగా.. ఈరోజు ఆమెను జగ్గారెడ్డి పరామర్శించారు. ట్రీట్మెంట్ కోసం నాలుగు లక్షలు రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించాను. స్పెసిఫిక్గా మీడియా ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. క్యాన్సర్ ఎవ్వరికీ రావొద్దు. క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితం. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం లేదు. పేషెంట్ ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు’ అని అన్నారు.
Also Read
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
Also Read: BJP MP Laxman: రాహుల్, రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు!
‘నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నా. మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు, ఈరోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషెంట్కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాను. నా వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం సహాయం కావాలని ఎంతో మంది వస్తారు. వారికి నా ద్వారా సహాయం అందుతుంది. కానీ.. ఎన్నడూ మీడియాలో రాదు, అది నాకిష్టం ఉండదు. ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా అందించడం జరిగింది’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
-
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
-
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!