Madhyapradesh : మందు కొట్టి మత్తులోకి జారుకున్న టీచర్.. వీడియో తీసి వైరల్ చేసిన విద్యార్థులు
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ టీచర్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు చేరుకున్నాడు. అతని శరీరాన్ని కూడా నియంత్రించలేకపోయాడు. అతి కష్టం మీద స్కూల్ మెట్ల దగ్గరకు చేరుకుని కూర్చుండిపోయాడు. అది చూసిన విద్యార్థులు టీచర్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. జబల్పూర్ జిల్లా బాఘ్రాజీ క్లస్టర్లోని జమునియా స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఉపాధ్యాయుడు మద్యం మత్తులో అక్కడక్కడ తిరుగుతూ కనిపించాడు. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతం రోజూ మద్యం తాగి పాఠశాలకు వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటాడని చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు పాఠాలు చెప్పాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
Read Also:TG To Replace TS: ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం..!
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ కూడా పలుమార్లు ఉపాధ్యాయుడికి వివరించి మద్యం సేవించి పాఠశాలకు రావద్దని సూచించాడు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఇంతకుముందు కూడా ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్ను ఎక్కడ పోస్ట్ చేసినా, అతను ప్రతిచోటా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించాడని తోటి ఉపాధ్యాయులు చెప్పారు. చాలా సార్లు పరిస్థితి దిగజారడంతో సాయంత్రం పాఠశాల మూసిన తర్వాత అతడిని ఇంటికి తీసుకెళ్లామని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ఈ ఉపాధ్యాయుడిని వెంటనే పాఠశాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. 55 మంది పిల్లలకు ఇక్కడ ప్రవేశం కల్పించారు. ఉపాధ్యాయుడు రాజేంద్ర నేతమ్ మద్యం సేవించి పాఠశాలలో తలదాచుకోవడం, ఇతర ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఒకచోట కూర్చొని పాఠాలు చెప్పడం చాలా సార్లు జరుగుతుంది. ఇప్పుడు అతని వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధర్మేంద్ర ఖరే దీనిపై విచారణకు డీపీసీని ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక రాగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also:Megastar Fans: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్పై చిరు సినీ లైఫ్ జర్నీ వీడియో
తాజావార్తలు
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!