IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా.. ఆర్థిక లావాదేవీలపై ఆరా..!
- హైదరాబాద్ ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఐటీ శాఖ దాడులు
- ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీలపై అధికారులు దృష్టి.
- పిస్తా హౌస్, షాగౌస్, మేహ్ఫిల్ యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids On Restaurants: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో లెక్కలో లేని నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం.
World’s Best Cities: 2025లో ప్రపంచంలోని ఉత్తమ నగరాలు లిస్ట్.. భారత్ నుండి మూడు నగరాలకు చోటు..!
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
తాజా పరిణామాలలో భాగంగా.. వుడ్బ్రిడ్జ్ (Wood Bridge) హోటల్ యజమాని, బీఆర్ఎస్ నాయకుడు అయిన హర్షద్ అలీ ఖాన్ ను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు (డిసెంబర్ 2) ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. హర్షద్ అలీ ఖాన్ను విచారించిన ఐటీ అధికారులు, గతంలో దాడులు జరిగిన పిస్తా హౌస్ తోపాటు ఇతర హోటళ్లు, రెస్టారెంట్లతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ హోటళ్లకు పరస్పరం లింకులు ఉన్నాయనే అనుమానంతో ఐటీ అధికారులు వారిపై కూడా దృష్టి సారించారు.
Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి..!
నవంబర్ 18న పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరిగాయి. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ హోటళ్లు రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. పన్ను చెల్లింపులో వ్యత్యాసంతో పాటు.. అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ దాడులు ముమ్మరం అయ్యాయి. ఈ దాడుల్లో లభించిన అక్రమ ఆస్తులు, నగదు వివరాలను ఐటీ అధికారులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!