IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాలకు నిధుల తరలింపులో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానాలతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, రూ.1,000 కోట్ల విదేశీ చెల్లింపులపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయి నిఘా ఆధారంగా హైదరాబాద్లో 9, విశాఖపట్నంలో 3, గుంటూరులో ఒక ప్రాంతంలో ఐటీ బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లోని సంస్థలకు భారీగా నిధులు మళ్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఆపరేషన్లో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్పైల్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థపై ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఒక్క సంస్థ నుంచే సుమారు రూ.900 కోట్ల విదేశీ చెల్లింపులు జరిగినట్లు గుర్తించి, కంపెనీ డైరెక్టర్లు దీపక్ నంబరు, మాధవ రామ్ పొనపల్లి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. అలాగే గుంటూరులోని అరుండల్పేటకు చెందిన ఒక వ్యక్తి ప్రాంగణంలో జరిగిన సోదాల్లో రూ.130 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించిన 15 అనుమానాస్పద సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, రవాణా సేవల పేరుతో ఈ చెల్లింపులు జరిపినట్లు చూపుతున్నప్పటికీ, ఆయా సేవలు నిజంగా అందాయా లేదా కొన్ని ఉనికిలో లేని షెల్ కంపెనీలకు నిధులు తరలించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Also Read
ఈ అక్రమ నిధుల మళ్లింపు ప్రక్రియలో ఫామ్ 15CB ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన వృత్తి నిపుణుల పాత్రపై కూడా అధికారులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA), ఒక కంపెనీ సెక్రటరీ (CS) నివాసాల్లో సోదాలు నిర్వహించి పత్రాలను పరిశీలించారు. చాలా తక్కువ వ్యాపార టర్నోవర్ ఉన్న సంస్థలు, అసలు ఐటీ రిటర్నులు దాఖలు చేయని కంపెనీలు కూడా భారీ మొత్తంలో విదేశీ రెమిటెన్సులు జరిపినట్లు డేటా విశ్లేషణలో తేలింది. తక్కువ సంఖ్యలో ఉన్న కొందరు నిపుణులే అత్యధిక సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసి, ఈ నిధులను కొన్ని ప్రత్యేక విదేశీ సంస్థల సమూహాలకే పంపినట్లు ఆధారాలు లభించాయి.
గతంలో నకిలీ ధార్మిక ట్రస్టుల ద్వారా జరిగిన అకామిడేషన్ ఎంట్రీల దర్యాప్తు నుంచి ఈ విదేశీ చెల్లింపులకు సంబంధించిన కీలక లింకులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 18న ప్రారంభమైన ఈ ప్రత్యేక ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 394 సంస్థలు, 36 మంది వృత్తి నిపుణులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. వీటిలో భూ సరిహద్దు రాష్ట్రాలకు చెందిన 117 సంస్థలు కూడా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ ఖాతాలు, పన్ను పత్రాల విశ్లేషణ పూర్తయిన తర్వాత ఈ విదేశీ చెల్లింపుల వెనుక ఉన్న అసలు మాస్టర్మైండ్ వివరాలు బయటకు రానున్నాయి.
తాజావార్తలు
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!