NTV Telugu Site icon

Benjamin Netanyahu: హమాస్‌ను నాశనం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు..

Israel Pm

Israel Pm

Benjamin Netanyahu: హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాకు వెళ్లే విదేశీ సహాయం ఈజిప్ట్‌తో ఉన్న రఫా సరిహద్దులో నిలిచిపోయింది. 23 లక్షల జనాభా ఉన్న ఈ పాలస్తీనా ప్రాంతంలో మానవతా సంక్షోభం ముదిరే ప్రమాదం ఉంది. హమాస్ దాడుల కారణంగా గాజాపై ఇజ్రాయెల్ ముట్టడి వేసింది. గాజా స్ట్రిప్‌లో ఒక్క హమాస్ ఉగ్రవాది కూడా సజీవంగా ఉన్నంత వరకు ముట్టడి ఆగదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఉత్తర గాజాలో సైనిక చర్య కోసం భారీ ఆయుధాలతో లక్షలాది మంది సైనికులను మోహరించింది.

Also Read: Gaza Food Crisis: గాజాలో ఆహార సంక్షోభం.. రొట్టెల కోసం గంటల తరబడి క్యూలోనే..

ఇదిలా ఉండగా హమాస్‌ను నాశనం చేసేంతవరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రష్యా అధినేత పుతిన్‌కు వెల్లడించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఇరువురు నేతలు ఫోన్‌కాల్‌లో సంభాషించుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌ క్రూరమైన హంతకులు దాడి చేశారని, ఈ క్రమంలోనే దృఢ నిశ్చయంతో, ఐక్యంగా హమాస్‌పై యుద్ధానికి వెళ్లామని పుతిన్‌కు చెప్పారు. హమాస్‌ సైనిక, పాలనాపర సామర్థ్యాలను నాశనం చేసేంతవరకు యుద్ధం ఆగదని పుతిన్‌కు నెతన్యాహు స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా అధినేత పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు.

Also Read: మిస్ వరల్డ్ టైటిల్స్ సాధించిన టాప్ 10 దేశాలు ఇవే..

మరోవైపు ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ గ్రూప్ ఘోరమైన దాడి తర్వాత గాజా పాలకులు హమాస్‌పై దేశం చేస్తున్న యుద్ధంలో విస్తృత అంతర్జాతీయ మద్దతు కోసం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం పిలుపునిచ్చారు. హమాస్‌ను ఓడించేందుకు ప్రపంచం ఇజ్రాయెల్‌కు అండగా నిలవాలని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌ను కలిసి నెతన్యాహు అన్నారు. అక్టోబరు 7న గాజా నుండి హమాస్ మిలిటెంట్లు దేశంపై దాడి చేసినప్పటి నుండి ఇజ్రాయెల్‌ను సందర్శించిన అగ్ర రాజకీయ నాయకులలో జర్మన్ నాయకుడు ఒకరు.ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య దాడుల్లో దాదాపు 4 వేల మంది ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌తో పాటు జోర్డాన్‌ పర్యటనకు సిద్ధం కావడం గమనార్హం.